Telugu desam tdp ex mp gadde rammohan rao demand on chandra babu naidu

gadde rammohan rao, tdp ex mp gadde rammohan rao, tdp party, chandra babu naidu, 2014 election, vijayawad mp seat demand, kesineni nani, tdp leaders,

tdp ex mp gadde rammohan rao demand on chandra babu naidu

ఎంపీ సీటు ఇస్తే నేనూ డబ్బు ఖర్చు పెడతా

Posted: 05/22/2013 04:38 PM IST
Telugu desam tdp ex mp gadde rammohan rao demand on chandra babu naidu

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు గెలుపు గుర్రల కోసం వేట మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గెలిచే నాయకులు ముందుగానే రాజకీయ పార్టీలు కొన్ని షరతులు పెడుతున్నాయి. ఎన్నికల్లో ఖర్చు పెట్టే నాయకులకే పార్టీ సీట్లు ఇస్తామని బహిరంగంగానే చెప్పిన పార్టీలు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే టిక్కెట్ కు, ఎంపీ టిక్కెట్ కు ఆయా పార్టీ ఒక రేటు ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోందని రాజకీయ నాయకులు అంటున్నారు.

రాజకీయ పార్టీలే అలా షరతులు పెట్టినప్పుడు, ఇక గెలిచే రాజకీయ నాయకులు ఎన్ని షరతులు పెడాలి.. అనే అనుమానం ప్రతి ఒక్కరి మనసు ను తాకిన ప్రశ్న. అయితే ముందుగా ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగించాడు. ‘‘నాకు ఎంపీ టిక్కెట్ ఇస్తేనే ..నేను డబ్బు ఖర్చు పెడతా?’’ అని రాజకీయ ప్రకటన చేశాడు. రాజకీయాల్లో డబ్బు ప్రధానమని.... అయితే డబ్బే రాజకీయం కాదని టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు అన్నారు. టీడీపీ తరఫున ఎంపీ సీటు ఇస్తే తాను డబ్బు ఖర్చు పెడతానని వ్యాఖ్యానించారు.

ఎంపీ సీటు తన డిమాండ్ అని... అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే ఆ ప్రకారమే నడుచుకుంటానని గద్దె తెలిపారు. పార్టీలోకి కొత్తగా వచ్చినవారు డబ్బు ఖర్చుపెడితే.. ఎప్పటినుంచో పార్టీలో ఉండి డబ్బు ఖర్చుపెడుతున్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. త్వరలో చంద్రబాబును కలిసి ఎంపీ సీటు హామీ పొందుతానని తెలిపారు. గతంలో విజయవాడ ఎంపీగా గెలిచి, అనంతరం రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన గద్దె రామ్మోహన్ ఈసారి మాత్రం విజయవాడ ఎంపీ స్థానం దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు.

అయితే పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జీ కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నానిని నియమించడంతో ఎంపీ సీటు కోసం పోరు మొదలైంది. కాగా గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీ చేశారు. అయితే ఈ మధ్య పార్టీలో చేసిన మార్పులతో విజయవాడ అర్బన్ అధ్యక్ష పదవినుంచి వంశీని తప్పించి, నానిని నియమించారు.

ఇటీవలే పార్టీలోకి వచ్చిన నానికి ఈ పదవి కట్టబెట్టడంపై ఇటు గద్దె రామ్మోహన్ తో పాటు వంశీవర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. అసలే పార్టీ లోని ముఖ్య నాయకులు గోడ దూకుతున్న రోజుల్లో పార్టీకి ఇలాంటి డిమాండ్ పెడితే పార్టీ పరువు పోతుందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ‘‘ములిగే నక్క మీద తాటికాయ పడటం అంటే ఇదేనోమో ’’నని పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more