భారతీయ సినిమా ఇండస్ట్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వందేళ్ళ కాలంలో ఈ రంగుల ప్రపంచం ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ఈ వంద సంవత్సరాలలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. ఎంతో మంది గొప్ప గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధ్బుత ద్రుశ్య కావ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘మాయాబజార్ ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ భాషలన్నింటిలో వచ్చిన మహా మహా చిత్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. జాతీయ వార్తా ఛానల్ - ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ పోల్ లో ఈ సినిమాకే పట్టం కట్టారు. 1957లో తొలిసారిగా తెలుగులో విడుదల అయిన ఈ చిత్రం 23.91 శాతం ఓట్లను సంపాదించుకుంది. ఆ తరువాత పలు భాషల్లో రీమేక్ చేశారు.
ప్రముఖ నిర్మాతలు అయిన చక్రపాణి, నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పటి నటులందరి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ పోల్ లో ప్రముఖ నటి శోభన నటించిన తమిళ చిత్రం ‘మనిచిత్రరాజు ’ రెండో స్థానంలో నిలిచింది. మమ్మూట్టికి అవార్డు తేవడమే కాకుండా హీరోగా తానేంటో చూపించిన మరో మళయాళ చిత్రం ‘ఓరు వడక్కన్ వీరగాథ ’ మూడో స్థానంలో నిలిచింది. రాంగోపాల్ వర్మ శివ.. 7 స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 100 సినిమాల్లో తెలుగువారి ఆణిముత్యాలు అనదగ్గ పలు సినిమాలు స్థానం సంపాదించుకున్నాయి. హిందీలో సంచలన విజయం సాధించిన ‘షో ’ లే సినిమా టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంది. ఇంకా పథేర్ పాంచాలి, నాయగన్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లు టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నాయి. ‘మాయా బజార్ ’ మొదటి స్థానం దక్కించుకుందంటే... ప్రతి తెలుగు వాడు గర్వించదగిన విషయం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more