ఎలాంటి ‘దాడి ’ లేకుండా, సైలెంట్ గోడ దూకి.. వైసీపీలోకి చేరిన టీడీపీ నాయకుడు దాడి వీరభద్రరావుకు వైసీసీ నుండి తీపి కబురు రాబోతున్నట్లు తెలుస్తోంది. దాడి వర్గీయులు ఒత్తిళ్లను లెక్కచెయ్యకుండా పార్టీ వదిలి వెళ్లిన దాడికి వైసీపీ రెడ్ కార్పేట్ పరిచింది. ఆ వైసీపీలో సీనియర్ నాయకుల నుండి దాడికి వ్యతిరేకత రావటంతో. అటూ ఇటూ నలిగిపోయిన దాడికి వైసీపీ అధిష్టానం దాడికి కీలక బాధ్యతలు అప్పగించేపనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ల మాటను వైకాపా నాయకత్వం లెక్కచేయడం లేదు. దాడి వీరభద్రరావు విషయంలో నాయకత్వం వ్యవహరించిన వైఖరే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్ మరణాన్ని కూడా అపహాస్యం చేసిన వారితో కలిసి పని చేసే పరిస్థితి లేదని కొణతాల ఘాటుగా స్పందించారు.
కొణతాల పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది. కొణతాల బయటికి వెళ్ళితే పార్టీకి నష్టమని భావించిన పార్టీ పెద్దలు సోమయాజులు, వైవీసుబ్బారెడ్డిలు రంగంలోకి దిగి రామకృష్ణను బుజ్జగించారు. ఆయన్ని బలవంతపెట్టి పార్టీలో కొనసాగించేలా చేశారు. అయితే దాడి వీరభద్రరావు విషయంలో రామకృష్ణ కోర్కెలు, షరతులను మాత్రం వైకాపా నాయకత్వం అంగీకరించే పరిస్థితి కానరావడం లేదు. దాడిని చేర్చుకోవడం సరే, ఉత్తరాంధ్రలో తన ప్రాధాన్యత తగ్గకుండా చూడాలని పార్టీపై కొణతాల షరతు పెట్టారని అందుకు పార్టీ కూడా అంగీకరించిందని చెబుతున్నారు. అయితే పార్టీ మాత్రం తను అనుకున్న విధంగా చేసుకుపోతోంది. దాడి వీరభద్రరావును త్వరలోనే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలోనికి తీసుకోనున్నట్లు సమాచారం. దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ పదవిని ఆయనకు అప్పగిస్తున్నారని చెబుతున్నారు.
ఇప్పటికే రామకృష్ణ పీఏసీలో సభ్యులుగా ఉంటున్నారు. మరి దాడికి ఆ పదవి అప్పగిస్తే సహజంగా రామకృష్ణ ప్రాధాన్యత తగ్గుతుంది. దీనికి తోడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే రామకృష్ణ విశాఖ జిల్లాకు లేదా అనకాపల్లి నియోజకవర్గానికో పరిమితం కావాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని కొణతాల వర్గీయులు జీర్ణించుకోలేరు. రామకృష్ణ కూడా బలవంతంగా ప్రస్తుతానికి పార్టీలో కొనసాగుతున్నా దాడికి గనుక ఆ ప్రాధాన్యత ఇస్తే తన దారి తాను చూసుకుంటానని పార్టీలో కొనసాగే పరిస్థితి ఉండదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ విషయమై తనకున్న సమాచారాన్ని రామకృష్ణ ఇటీవల పార్టీ పెద్దలతో పంచుకున్నారని, అధ్యక్షుడు జగన్ తీసుకుబోయే నిర్ణయం అయినందున తామేమి చేయలేమని వారు నిస్సహాయత వ్యక్తం చేశారని తెలిసింది. నిజంగా గనుక దాడికి పార్టీలో ప్రచారం జరుగుతున్న విధంగా పదవులు కట్టబెడితే కొణతాల వర్గం వైకాపాకు గుడ్బై చెప్పేది ఖాయమని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more