ఏదైనా నేరం జరిగినప్పుడు సంబంధిత వ్వక్తులు లక్ష చెపుతుంటారని, అయితే వాటిని నిర్థారించే పత్రాలు ఉన్నాయా? లేవా? అనేది తెలుసు కుంటారని ఆ తరువాతే దానిపై తుది నిర్ణయానికి వస్తారని చాకో తెలిపారు. తాము తమ నివేదికలో ఎలాంటి తప్పు కానీ అనౌచిత్యం కానీ చేయలేదని ఆయన స్పష్టంచేశారు. రాజా అటు ప్రధానిని, ఇటు ఆర్థిక మంత్రిని కూడా ఈ కేటాయింపులకు సంబంధించి పక్కదోవ పట్టిం చారని, రికార్డుల ద్వారా స్పష్టం అవుతోందని ఆయన తెలిపారు. టెలికాం స్కాంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరంలకు క్లీన్చిట్ ఇవ్వడాన్ని జేపీసీ చైర్మన్ చాకో సమర్థించుకున్నారు. స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి వీరిద్దరూ నేరం చేసినట్లు నిరూపించే ఏ ఒక్క ఆధారం లేదని చాకో తెలిపారు. తప్పులేదని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా నివేదిక ఇవ్వడంలో తప్పులేదు కదా అని ఆయన అన్నారు. నివేదిక ముసాయిదా ముందుగానే వెల్లడి కావడం, అందులో ప్రధాని, ఆర్థిక మంత్రి పేర్లు లేకపోవడం, మాజీ ప్రధాని వాజ్పేయి పేరును ప్రస్తావించడం వంటి అంశాలపై బీజేపీ మండిపడుతోన్న నేపథ్యంలో వాటికి చాకో సమాధానమిచ్చారు.
ప్రధానిని, ఆర్థిక మంత్రిని కమిటీ విచారణకు పిలిపించాలని బీజేపీ డిమాండ్చేస్తూ వచ్చిందని, అయితే కమిటీలోని 30 మంది సభ్యులలో మెజార్టీ సభ్యులు దీనిని వ్యతిరేకించడంతోనే మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగానే తాము వ్యవహరించామని చాకో తెలిపారు. అప్పటి టెలికం మంత్రి ఏ రాజాకు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించినందునే ఆయనను కమిటీ ముందుకు పిలిపించలేదని చాకో వివరించారు. కేటాయింపుల వివాదానికి సంబంధించి ప్రధాన కేంద్ర బిందువుగా రాజా మారిన విషయం తెలిసిందే. కేటాయింపుల నిర్ణయం ఖరారుకు సంబంధించి ప్రధాని కానీ, ఆర్థిక మంత్రి కానీ అక్రమానికి పాల్పడినట్లు లేదా వారు కేటాయింపులకు బాధ్యత వహించినట్లు తమకు ఎలాంటి ఆధారం దొరకలేదని ఆయన స్పష్టంచేశారు. 2జీ కేటాయింపులకు సంబంధిం చి తాను విధాన నిర్ణయాన్ని ప్రధానికి, ఆర్థిక మంత్రికి చెపుతూ వచ్చానని మాజీ మంత్రి రాజా చెపుతూ వస్తున్నారు. ఆయన వాదనను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని, చాకో కావాలనే వారిని రక్షించారని, తప్పుడు నివేదికతో తప్పుదారి పట్టించారని పార్లమెంట్లోనూ బయట కూడా ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. అయితే ఈ వాదనను చాకో తోసిపుచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more