వార్తా పత్రికలు కేవలం ప్రకటనలమీదనే ఆధారపడివున్నాయి. దినపత్రిక వెల చూసుకుంటే దానిలో పేపర్ ఖరీదు కూడా రాదు. ఇక వార్తలను సేకరించటానికి అయ్యే ఖర్చు, సిబ్బంది జీతాలు, రవాణా, ఇతర ఖర్చులు ఎక్కడినుంచి వస్తాయి. వీటన్నిటినీ భరించేవి వ్యాపార ప్రకటనలే. ప్రకటనల ద్వారా వచ్చే సొమ్ముపత్రికను తీర్చిదిద్ది, పాఠకులకు తక్కువ ధరలో అందిస్తూ వార్తా పత్రికలు తమ మనుగడకోసం కావలసిన లాభాలను కూడా ఆర్జిస్తున్నాయి. దినపత్రిక కొనటానికి అయ్యే ఖర్చు వాటిని రద్దీలో అమ్మనప్పుడు వస్తోందంటే అవి ఎంత తక్కువ ధరకి అందుబాటులో ఉన్నాయో తెలుస్తోంది.
ఆధునిక కాలంలో డిజిటల్ సాంకేతిక పరిఙానం పెరిగినతర్వాత అచ్చువేసే విధానంలో మార్పు వచ్చినట్లే, పాఠకులలో కూడా మార్పులు వచ్చాయి. పేపర్ మీద రాసినదంతా చదివే ఓపిక లేక టివి ఛానెల్స్ లో చూడటం మొదలుపెట్టారు. మొబైల్ ఫోన్లలోనూ టాబ్ లెట్ లోనూ ఇంటర్ నెట్ ద్వారా వార్తలందుతున్నాయి. ఈ నేపధ్యంలో వార్తా పత్రికలలో ప్రకటనలకు బదులు టివి ఛానెల్స్ కే వ్యాపారస్తులు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. దానితో సర్క్యులేషన్ ప్రతి సంవత్సరమూ పెరుగుతూనేవుంది కానీ, వార్తా పత్రికల రాబడి తగ్గిపోతోంది.
దీనికి పరిష్కారంగా వార్తా పత్రికలు మనుగడ సాగించటం కోసం డిజిటల్ మార్గాన్ని తొక్కుతున్నాయి. అందుకే ప్రతి వార్తపత్రిక తమ ప్రింట్ మీడియా మీద కంటే డిజిటలైజ్డ్ మీడియా మీదనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి. అందులోనే రాబడిని వెతుక్కుంటున్నాయి. వ్యాపారస్తులు తమ ఉత్పాదనలను పెంచుకోవటానికి డిజిటల్ పద్ధతిలోనే ప్రకటనలివ్వటం చెయ్యవచ్చు. దానితో పాటు వార్తా పత్రికలు ఇ కామర్స్ ని కూడా ఉపయోగించవచ్చని అమెరికన్ సర్వే లో తేలింది. ఇందులో, ఉత్పాదకులు డైరెక్ట్ గా వినియోగదారులతో సంబంధాలను నెలకొల్పుకోవచ్చు. ఇలాంటి సేవల ద్వారా వార్తా పత్రికలు తమ రాబడిని పెంచుకోవచ్చు.
అయితే ఇప్పటికే ఈ త్రోవలో ఎన్నో వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి. వార్తా పత్రికలు కూడా ఈ మార్గాన్ని అవలింబచటానికి పూనుకోవటంతో ఆ పరుగుపందెంలో వాళ్ళు జూనియర్లు అయిపోతున్నారు. అయినా, వార్తా పత్రికలు తముకున్న నెట్ వర్క్ ద్వారా మెరుగైన వార్తలు, విశ్లేషణలు అందించగలుగుతాయి కాబట్టి, వాటికోసం ఆయా డిజిటల్ పేపర్లను చూసే అవకాశం ఎక్కువుంటుందని, తద్వారా రాబడి కూడా పెరిగి, ప్రింట్ మీడియా మీద వచ్చే నష్టాన్ని పూరిస్తుందని ఆశిస్తున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more