ఒకాయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్. పేరు వీరారెడ్డి. మరొకాయన పారిశ్రామికవేత్త సంజయ్ మొరారి. వీరి ఇళ్ళల్లో మహబూబ్ నగర్ కి చెందిన 15 సంవత్సరాల టి.రమేష్, శ్రీకాకుళానికి చెందిన 13 సంవత్సరాల సత్య పనిచేస్తున్నారు.
హైద్రాబాద్ ఎమ్ ఎల్ క్వార్టర్స్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించిన లేబర్ డిపార్ట్ మెంట్ అధికారులకు బాల కార్మికులు ఇళ్ళల్లో పనిచేస్తూ కనిపించారు. వాళ్ళని అధికారులు పని చెర నుంచి విడిపించారు.
మొరారి ఇంట్లో పనిచేస్తున్న సత్యని నీకెంత ఇస్తున్నారమ్మా అని అడిగితే తనకి తెలియదట. మొరారి సత్య తల్లిదండ్రులకే పైకం ఇస్తున్నారట. వీరారెడ్డి ఇంట్లో పనిచేస్తున్న కనిపించిన రమేష్ విషయంలో అతను మాదగ్గర పనిచెయ్యటంలేదు, దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పోతున్నాడని చెప్పారు. యజమానులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్న లేబర్ అధికారులు ఆ వివరాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలనూ లేబర్ అధికారులు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచగా, అబ్బాయి రమేష్ ని సైదాబాద్ లో ఉన్న ప్రభుత్వ బాలల వసతి గృహానికి, అమ్మాయి సత్యను నింబోలి అడ్డాలో ఉన్న బాలికల వసతి గృహానికి తరలించమని ఆదేశించారు.
వాళ్ళిద్దర వయసు నిర్ధారణ చెయ్యగానే ఛైల్డ్ లేబర్ (ప్రోహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ సెక్షన్ 3 కింద వారిని పనిలో పెట్టుకున్నవారిమీద కేసు నమోదవుతుంది.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్.నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో కూడా ముగ్గురు బాల కార్మికులను పని నుంచి తప్పించి వాళ్ళ ముగ్గురికీ రూ.20000 చొప్పున యజమానుల చేత జుర్మానాగా ఇప్పించారు.
పాత బస్తీలో బాల కార్మికులు కోకొల్లలుగా ఇంకా కనిపిస్తారు. వర్క్ షాపుల్లో పనిచెయ్యటానికి పిల్లల తల్లిదండ్రులకు రూ.10000 నుంచి 30000 వరకు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటారు. దీనివలన పనివాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారేమోననే భయం ఉండదని వాళ్ళు భావిస్తున్నట్టుగా లోగుట్టు బయటపడ్డ సందర్భాలున్నాయి.
చిన్నపిల్లలను పనిలో పెట్టుకోగూడదనే నియమం ఉన్నా, లేబర్ అధికారుల కన్నుగప్పి దుకాణాలలో, చిన్న చిన్న వర్క్ షాపులలో, పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా పనిలో పెట్టుకుంటూనేవున్నారు.
చిన్న పిల్లలంటే తేరగా లేక తక్కువ మొత్తానికి, చచ్చినట్టు పడుండి చెప్పినట్టుగా చేసేవాళ్ళు, ఎక్కడో ఎక్కువ జీతం వస్తుందని వెళ్ళిపోయేవారు కాదు కాబట్టి ఎలాగో ఒకలాగా అధికారుల కంటబడకుండా వాళ్ళని ఉపయోగించుకుందామనుకుంటున్నారే కానీ, చిన్నపిల్లలు దేశ భవితలో భాగమని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరిలో ఎంత సామర్థముందో మనకేం తెలుసు. సరైన శిక్షణ లభిస్తే వాళ్ళల్లో ఎంతమంది శాస్త్రవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, నాయకులు కూడా అవొచ్చు. ఈ రోజు పని జరిగిపోతుందని చూసుకుంటున్నారు కానీ దేశ ప్రగతి కుంటుపడుతున్నదని అర్ధం చేసుకోలేకపోతున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more