‘‘అనుకున్నది ఒక్కటి.. అయ్యింది మరొక్కటి’’ అనే విధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది. గత సంవత్సరం అక్టోబర్ 02 (గాంధీ జయంతి) రోజు చంద్రబాబు నాయకుడు ‘వస్తున్నా.. మీకోసం’ అంటూ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే రెండు వేల కిలోమీటర్లు పైనే పాదయాత్ర చేయటం జరిగింది. కానీ చివరకు ఫలితం శూన్యం అయ్యింది. ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు.. ప్రజలే చిరాకుపడే స్థాయికి పాదయాత్ర చేరుకుంది. పాదయాత్రలో చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వం కారాలు, మిరియాలు నూరి.. చివరకు అటు ఇటు కానీ .. ఎందుకు ఈ పాదయాత్ర అన్న విధంగా తయరైంది. ప్రభుత్వాన్ని పడగొట్టండి? కాంగ్రెస్ పార్టీని అంతం చేయండి? పార్టీ కి పుట్టగతులులేకుండా చేయమని ప్రజలకు చెప్పిన బాబే ప్రజల ముందు దోషిగా నిలబడ్డాడు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో జరిగిన అవిశ్వాసం తీర్మానం పై బాబు వైఖరి ఏమిటో పూర్తిగా అర్థం అయింది. టీఆర్ఎస్, వైసీపీ, సిపీఎం, సీపిఐ , పార్టీలు అవిశ్వాస తీర్మానం పెడితే.. కాంగ్రెస్ పార్టీ కి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి మాత్రం అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీతో బాబుకు మైత్రి సంబంధం ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు పాదయాత్ర పేరుతో ప్రజల వద్దకు వచ్చిన బాబుది ద్రుతారాష్ట్ర కౌగిలని రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. ఈ విషయంతో బాబు పాదయాత్ర కు ప్రజలు పలసబడిపోయారు. అవిశ్వాస తీర్మానం దెబ్బ టిడిపి పార్టీకి బాగా తగిలిందని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ విషయం చర్చలు జరిపి బాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర ఆపేస్తే మంచిదని ఆయన భావించారు. పాదయాత్ర ఆపటానికి ప్రధానంగా ఐదు కారణాలు తెరపైకి వచ్చాయాని టిడిపి నాయకులు అంటున్నారు.
1. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవటంతో.. ప్రజలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలిసిపోయిందని రాష్ట్ర ప్రజలకు అర్థం అయింది. ఇక పాదయాత్ర చేసిన ఫలితం ఉండదని బాబుకు తెలిసిపోయింది.
2. చంద్రబాబు ఇప్పటికే రెండు వేల కీలమీటర్లు దాటి పాదయాత్ర చేయటంతో.. 63 ఏళ్ల చంద్రబాబు శరీరం సహకరించటం లేదట. ప్రతిరోజు చంద్రబాబు బాడీలో కొత్త కొత్త మార్పులు రావటం, ఆయనకు విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది.
3. ఇప్పటి వరకు బాబు శరీరమే ప్రాబ్లమ్ అయ్యింది. ఇక నుండి వాతావరణం కూడా వేడెక్కుతుంది. ఈ వేసవి కాలంలో బాబు పాదయాత్ర చేయటం చాలా కష్టం కాబట్టి, ఎండల వేడికి బాబు పరిస్థితి ఘోరంగా ఉంటుంది కాబట్టి పాదయాత్ర ఆపేస్తే మంచిదని సీనియర్ నాయకులు బాబుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
4. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న జిల్లాలో .. సరైన నాయకుడు లేకపోవటం, అంతేకాకుండా ఆర్థికంగా వెనబడిన జిల్లాలు కావటం, పాదయాత్ర ఖర్చు భరించే నాయకుడు లేకపోవటం పెద్ద మైనస్ పాయింట్. అంతేకాకుండా.. భూమా నాగిరెడ్డి చంద్రబాబు చేసిన కామెంట్ కూడా హాట్ టాఫిక్ మారింది. ప్రతి 200 కిలో మీటర్లకు ఒక నాయకుడు టిడిపిని వదిలివెళ్లిపోవటం జరిగింది అని చెప్పటం పై బాబు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
5. అంతేకాకుండా ఇటీవల నందమూరి కుటుంబం నుండి కొన్ని కొత్త సమస్యలు రావటం, బాలయ్యకు ఎన్టీఆర్ ల మధ్య వైర్యం పెరగటం, టిడిపి జూనియర్ ఎన్టీఆర్ దూరం కావటంతో, పార్టీలో కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. పాదయాత్రను లోకేష్ బాబు అప్పజెప్పి, పార్టీ సంగతలు బాబు చూసుకొనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే జనం వస్తున్నాప్పుడు , నా కొడుకు లోకేష్ పాదయాత్ర చేస్తే జనం ఎందుకు రారు అని, పాదయాత్ర పగ్గాలను లోకేష్ చేతిలో పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈవిధంగా చేయటంతో జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టవచ్చునని బాబు ఆలోచనని .. పార్టీలో సీనియర్ నాయకులు అంటున్నారు.
‘వస్తున్నా ..మీకోసం’ అన్న చంద్రబాబు అక్టోబర్ గాంధీ జయంతి రోజు మొదలుపెట్టారు. ఇప్పుడు ‘పాదయాత్ర ఆపేస్తున్నా... నా కోసం’ అంటూ ఏప్రిల్ 20న చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా పాదయాత్రను ముగిస్తున్నారని టిడిపి సీనియర్ నాయకులు అంటున్నారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖపట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్కు రానున్నారు. మిగిలిన ఆరు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more