ప్రఖ్యాత అజ్మేర్ దర్గాలో పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రవేశానికి దర్గా ప్రధాన అర్చకుడు అభ్యంతాలు తెలియజేసారు. ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్టీ ముస్లిం తీర్థ స్థలం. రేపు అందులో ప్రవేశించ దలచుకున్న పాక్ ప్రధాని రజా పర్వేజ్ అష్రఫ్ కి ఆ దర్గా ముఖ్యుడు దివాన్ అడ్డుచెప్పారు. అందుకు ప్రధాన కారణాన్ని భారత సైనికుల పట్ల అమానుష చర్చగా తెలియజేస్తూ ఇలా అన్నారు-
మహమ్మద్ ప్రవక్త సూక్తులను కానీ ఖురాన్ ని కానీ వాళ్ళు (పాకిస్తాన్ ప్రభుత్వం) పాటించటంలేదు. ఈ దర్గాలో ఆయన (పర్వేజ్ అష్రఫ్) ప్రార్ధనలు జరపాలంటే ముందుగా నరికి తీసుకుని పోయిన భారత జవాన్ (లాన్స్ నాయక్ హేమ్ రాజ్) తలను తిరిగి పంపించాలి. భారత్ ప్రధాన మంత్రికి, బాధితుల కుటుంబ సభ్యులకూ స్వయంగా క్షమాపణలు చెప్పుకోవాలి అని అన్నారు.
ఈ సంవత్సరం జనవరి 8 న జమ్మూ కాశ్మీర్ ఎల్ వోసి రేఖ దగ్గర పాకిస్తాన్ సైనికులు భారత్ సైనికుల మీద కాల్పులు జరిపి, ఆ తర్వాత భారత భూభాగంలోకి ప్రవేశించి, నిర్దాక్షిణ్యంగా సైనికుడిని చంపి, అంతకంటే అమానుషంగా అతని తలని తెగనరికి పాకిస్తాన్ లోకి తీసుకుని పోయారు. అయితే అటువంటి సంఘటనే జరగలేదని, అలాంటిదేమీ తమ దృష్టికి రాలేదని పాక్ ప్రభుత్వం అంటూ వస్తోంది.
పాక్ ప్రధాని దర్గా కి వస్తే అడ్డు పెట్టే హక్కైతే తనకి లేదు కానీ ప్రార్ధనా సమయంలో తాను స్వయంగా దగ్గరుండటం ఆయనకు స్వాగతం పలకటం జరగదని అన్నారు దివాన్. ఖాదిమ్ లు జియారత్ చేస్తారు కానీ నేనుండను. దీని అర్థమేమిటో పర్యవసానమేమిటో ఆయనకు (పాక్ ప్రధానికి) బాగా తెలుసు అని చెప్పారాయన.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి వేసుకున్న కార్యక్రమం ప్రకారం, రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకుని అక్కడ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గృహంలో భోజనం చేసి అక్కడినుండి హెలికాప్టర్ లో అజ్మేర్ దర్గాకు చేరుకుని ప్రార్ధనలు చేస్తారు. పాక్ ప్రధాని పర్యటనను పట్టించుకోగూడదని ముందు భారత్ ప్రభుత్వం అనుకున్నా తర్వాత మాత్రం ఆయనకు స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యటానికి నిర్ణయించుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more