తిరపతి వెళ్లి ఏడుకొండల స్వామి వెంకన్నకు మొక్కిన .. అయిన ఆయన నా మొర వినలేదు. అందుకే ఇలా జరిగింది. ఫామ్ను కోల్పోయిన టీమిండియా ఓపెనర్ వీరేందర్ సెవాగ్ ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టుల్లో ఆడే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెన్నై, హైదరాబాద్ నగరాల్లో జరిగిన మొదటి రెండు టెస్టుల్లో కలిపి సెవాగ్ కేవలం 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఫామ్ కోల్పోయిన అతనిని తప్పించాలని సందీప్ పాటిల్ నేతృత్వంలో ఇక్కడ సమావేశమైన జాతీయ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. అయితే, ప్రస్తుతానికి 14 మందితోనే జట్టును ప్రకటించింది. సెవాగ్ స్థానంలో కొత్తగా మరో ఆటగాడిని తీసుకోలేదు. కాగా, మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకోవడం విశేషం. సెవాగ్ను తప్పించడం మినహాయించి, మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టునే చివరి రెండు టెస్టుల్లోనూ కొనసాగించాలని సెలక్టర్లు తీర్మానించారు. మూడో టెస్టు ఈనెల 14 నుంచి మొహాలీలో, చివరిదైన నాలుగో టెస్టు ఈనెల 22 నుంచి ఢిల్లీలో మొదలవుతాయి. ఇప్పటికే సిరీస్పై భారత్ 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. మిగతా రెండు మ్యాచ్లను గెల్చుకుంటే తప్ప, బోర్డన్-గవాస్కర్ ట్రోఫీ కోసం జరిగే ఈ సిరీస్ను ఆస్ట్రేలియా డ్రా చేసుకోలేదు. చాలాకాలం ఫామ్లో లేకపోవడంతో సెలక్టర్లు ఈ సిరీస్ నుంచి తొలుత గౌతం గంభీర్ను తొలగించారు. రెండు అవకాశాలు ఇచ్చిన తర్వాత సెవాగ్ను కూడా తప్పించారు. దీనితో రెగ్యులర్ ఓపెనర్లు ఇద్దరూ జట్టులో స్థానాన్ని కోల్పోయారు. 2004 నుంచి భారత టెస్టు ఓపెనర్లుగా కొనసాగిన సెవాగ్, గంభీర్ 87 ఇన్నింగ్స్ ఆడి, తొలి వికెట్కు 4,412 పరుగులు జత చేశారు. సగటున 52.52 పరుగులు సాధించి, ‘ఆల్టైమ్ టాప్’ జాబితాలో ఐదో స్థానాన్ని ఆక్రమించారు. అయితే, రాను రాను వీరి ప్రతిభ మందగించడంతో, ఇద్దరిపైనా వేటు పడింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more