బిజెపిలో ప్రధాని మంత్రి పధాన మంత్రి పదవికి మోడీ పేరును జంప చేస్తున్నారు. కానీ బిజేసీ పార్టీలో సీనియర్ నాయకుడు మాత్రం మాటల మహారాణి ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బిజెపిలో చాలామంది పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా చూస్తున్న తరుణంలో పార్టీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ మాత్రం లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్పై ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో సమానమైన వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి అని అభివర్ణించారు. మూడు రోజులుగా ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో ఆదివారం ముగింపు సమావేశంలో అద్వానీ మాట్లాడుతూ, వాజపేయిలాగా సంభాషణా చాతుర్యం తనకు లేదని, అయితే సుష్మాస్వరాజ్కు అలాంటి నైపుణ్యం ఉందని అన్నారు. ‘వాజపేయిని చూసినప్పుడు నాలో ఎలాంటి భావనలు కలుగుతాయో సుష్మను చూసినప్పుడు కూడా అలాంటి భావాలే కలుగుతాయి’ అని అన్నారు. అంతేకాదు అద్వానీ తన ప్రసంగం ప్రారంభంలో తనకన్నా ముందు మాట్లాడిన సుష్మా స్వరాజ్ చెప్పినదానికన్నా మెరుగ్గా తాను ఏమీ చెప్పలేనన్నారు కూడా. ‘ఆమె ప్రతి విషయాన్ని ఎంతో విశదంగా వివరించారు.
కొన్ని రాష్ట్రాల్లో మనం ఎందుకు ఓడిపోయామో, కొన్నిచోట్ల హాట్రిక్ ఎందుకు సాధించామో, అలాగే ఎక్కడ హాట్రిక్ సాధించే అవకాశం ఉందో, ఎక్కడ గెలవలేమో అన్నీ ఆమె విషించి మరీ చెప్పారు’ అని అద్వానీ పార్టీ కార్యకర్తలకు గుర్తుచేసారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీని పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బిజెపిలోని కొంతమంది గట్టిగా కోరుతున్నప్పటికీ పార్టీ ప్రధాని అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా పోటీపడుతున్న వారిలో ఒకరయిన సుష్మాస్వరాజ్పై అద్వానీ ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా మోడీని స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ప్రశంసించడమే కాకుండా ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ కార్యకర్తలను కోరిన నేపథ్యంలో అద్వానీ సుష్మా స్వరాజ్ను ప్రశంసల్లో ముంచెత్తడం గమనార్హం. పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి తాము ప్రచారంలోకి రావడానికి కొంతమంది కార్యకర్తలు ప్రయత్నించడాన్ని, పార్టీ అగ్రనేతల మధ్య విభేదాలను అద్వానీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more