ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అంతా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన లండన్ వచ్చిన తరువాత అరెస్ట్ చేస్తామని పోలీసులు అన్నారు. కానీ అక్బరుద్దీన్ కొత్త డ్రామాకు తెర లేపారు. తన ఆరోగ్యం బాగాలేదని , నిర్మల్ పోలీసులకు తన తరపు లాయర్లతో చెప్పటంతో స్వయంగా నిర్మల్ పోలీసులే రంగంలోకి దిగి అక్బరుద్దీన్ ఆరోగ్య పరీక్షల కోసం గాంధీకి తరలించారు. అయితే ఇప్పుడు అందరి మనసులో ఒక్కటే ప్రశ్న? అక్బరుద్దీన్ ను అరెస్ట్ చేస్తారా లేక రెస్ట్ ఇస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది? ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను పోలీసులు అరెస్టు చేస్తారా?.. లేక అనారోగ్యం సాకుతో విశ్రాంతినిస్తారా?.. అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్కరుద్దీన్ నిజంగానే ఆరోగ్యంగా లేరా అన్న అంశాన్ని తేల్చేందుకు ప్రభుత్వ డాక్టర్ల బృందం ఆయనకు వైద్య పరీక్షలు చేస్తోంది. ఇందుకోసం అక్బరుద్దీన్ గాంధీ అసుపత్రికి చేరుకున్నారు. ఐదుగురు వైద్యుల బృందం ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు అన్ని పరీక్షలు చేస్తోంది. సాయంత్రం వరకు వైద్యుల నివేదిక బయటికి వస్తోంది.
అప్పటి వరకు అక్బరుద్దీన్ను అరెస్టు చేస్తారా లేదా అనే ఉత్కంఠ మాత్రం వీడే సూచనలు కనిపించట్లేదు. అక్బరుద్దీన్ గాంధీ అసుపత్రికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అనుచరులు, ఎంఐఎం కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగాను, దేశ సమగ్రతకు భంగం వాటిల్లే విధంగాను, రెండు వర్గాలు ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వాఖ్యలు చేశారన్న అరోపణల నేపథ్యంలో ఆయనపై పలు పోలీస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరో వైపు అక్బరుద్దీన్ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీతో పాటు, హిందూ వాహిని, అరెస్సెస్ వంటి సంస్థలు, పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అక్బరుద్దీన్ను విచారించేందుకు చర్యలు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని నిర్మల్ పోలీసులు నోటీసులు పంపారు. లండన్ నుంచి వచ్చిన అక్బరుద్దీన్ తన ఆరోగ్యం బాగాలేదని, నాలుగు రోజులు సమయం కావాలని పోలీసులను కోరారు. దీంతో అక్బరుద్దీన్ నిజంగానే అనాగ్యంగా ఉన్నారా అనే విషయాన్ని నిర్దారించేందుకు ప్రభుత్వ వైద్యుల ఆద్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొన్న తెల్లవారు జామున అక్బరుద్దీన్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి సినీ ఫక్కీలో క్షణక్షణం ఏం జరుగుతుందోనని, ఓ ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more