అఖిలపక్ష సమావేశానికి ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. సెకన్ల ముళ్ళు ఎలా ఫాస్టుగా తిరుగుతందో అన్ని పార్టీల గుండెలు అలా ఫాస్టుగా కొట్టుకుంటున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగు దేశం పార్టీ కూడా తన అభిప్రాయాన్ని అఖిలపక్ష సమావేశంలో మరో సారి వినిపించడానికి సిధ్ధం అయింది. 2008 అఖిల పక్ష సమావేశంలో ఏం అభిప్రాయం చెప్పారో, ఇప్పుడు అదే అభిప్రాయాన్ని చెప్పడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తెలం గాణ రాష్ట్రం ఏర్పడినా పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్న భావనతో ఉన్న టీడీపీ నాయకత్వం నిన్న సీమాంధ్ర నేతలతో చర్చలు జరిపింది. ఈ సమావేశంలో అఖిల పక్షంలో ఏం చెప్పాలనే దాని పై స్పష్టత వచ్చినట్లు తెలుస్తుంది. ఆ మేరకు 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఎర్రన్నాయుడు అందించిన తెలంగాణ అనుకూల లేఖను సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించనుంది.
2008లో పార్టీ తరఫున ప్రణబ్కు ఇచ్చిన లేఖలో తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, తిరిగి తమ వైఖరి మార్చుకోలేదని, 2009లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటయిన టీఆర్ఎస్తో కలసి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేయనుంది. 2009 ఎన్నికలయిన తర్వాత ఇప్పటి వరకూ తాము ఎలాంటి వైఖరి మార్చుకోలేదని స్పష్టం చేయనుంది. తాము 2008లోనే లేఖ రాసినప్పటికీ, ఇంతవర కూ కేంద్రం నిర్ణయం తీసుకోకపోగా, అసలు ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ప్రకటిం చకపోవడానికి కారణమేమిటని నిలదీయనుంది. కాంగ్రెస్ వల్లే తెలంగాణలో సమస్యలు వస్తున్నా యని, తన వైఖరి చెప్పకుండా మిగిలిన పార్టీల అభిప్రాయాలు అడిగే హక్కు కాంగ్రెస్కు ఎక్కడ ఉందని ఎదురుదాడి చేయడానికి కూడా సిద్ధం అయినట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more