కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ విస్త్రుత స్థాయి సమావేశంలో వాడీ వేడిగా చర్చలు జరిగాయి. ఒక తెలంగాణ సమస్య పై , మరో పక్క రెండు కులాలు నిరసనలతో దద్దరిల్లిపోయింది. అయితే కాంగ్రెస్ నాయకులు కూడా రెచ్చిపోయి ప్రసంగించారు. అలాంటి వారి లో కాంగ్రెస్ సినియర్ నేత ఎంపీ వి. హనుమంత రావు రెచ్చిపోయాడు. వైఎస్ జగన్ పై విహెచ్ విమర్శలతో దాడి చేసి సభలో వేడి రగిలించారు. రాష్ట్రం జగన్ అబ్బ జాగీరు కాదు.. ముఖ్యమంత్రి పదవి ఎవడబ్బ సొమ్ము అని అడుగుతున్నావ్ .. జగన్ పై సీనియర్ నాయకుడు వి. హనుమంతన్న ఆవేశంగా ప్రసంగించారు. హనుమంతన్న ఆవేశంతో ప్రసంగించినప్పుడు సభలోని కార్యకర్తలు కూడా ఊగిపోయినట్లు తెలస్తోంది. అంతేకాకుండా జగన్ ను జైలు గొడలు బద్దలు కోట్టి బైటికి తెస్తాం అంటే ఆయనేమైనా మహాత్మా గాంధీనా.. అని హనుమంతరావు ప్రశ్నించారు. ఈ విషయం పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఆయన పోలీసులను ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాందీని తిడుతుంటే.. అరె.. ఒక్కనేత స్పందించరు ఎందుకు అని కాంగ్రెస్ నాయకులను ఆయన అడిగినట్లు తెలుస్తోంది. సభలో విహెచ్ ఆవేశంతో ఊగిపోవడం చూసిన నాయకులకు కొంచెం భయం పట్టుందట. ఆయన అంత ఆవేశంగా ప్రసగించటంతో.. ఎక్కడ జరగరాని ఘోరం జరుగుతుందోనని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. కొంచెం చల్లబడిన ఆయన కార్యకర్తలన వలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. 2014 లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కార్యకర్తలకు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఒక సినీయర్ నాయకుడిగా తన సత్తా ఏమిటో చూపించుకున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more