ఢిల్లీ రాజకీయాల్లో ఏపీ హాట్ టాపిక్గా మారింది. 28 న తెలంగాణపై జరిగే అఖిలపక్షంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఇటు రాష్ట్ర నేతలతో పాటు.. అటు అధిష్టానం పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. ఇదే అంశంపై మన్మోహన్, సోనియాతో భేటీ అయిన గవర్నర్, హోం మంత్రి షిండేతోనూ సమావేశమయ్యారు. మరోవైపు.. టీ కాంగ్రెస్ ఎంపీలు ప్రధానితో భేటీ అయి.. 28 న జరిగే సమావేశంలో ఓ నిర్ధిష్ట అభిప్రాయం వచ్చేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.. హస్తినలో వేడి పుట్టిస్తున్నాయి. 28 న జరిగే అఖిలపక్ష సమావేశం కేంద్రంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై నివేదిక ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన గవర్నర్... మన్మోహన్, సోనియాతో భేటీ అయి.. తన అభిప్రాయాలను వెల్లడించారు. అటు... హోంమంత్రి షిండేతోనూ భేటీ అయిన నరసింహన్... అఖిలపక్షంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. డిసెంబర్ 28 తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రకంపనలు రానున్నాయి. ఆరోజు జరగనున్న అఖిలపక్షంలో కాంగ్రెస్ వైఖరిని చూసాక తెలంగాణ ఎంపీలు కీకల నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమౌతున్నారు. కొందరు టీఆర్ఎస్ గూటికి, మరికొందరు జగన్ వైపు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
అఖిలపక్ష సమావేశం పార్టీ పునాదులను కదిలించేలా తయారైందని సీనియర్లు భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానానికి ఝలకిచ్చేందుకు సిద్దమయ్యారు. అఖిలపక్ష సమావేశం తర్వాత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేందుకు సిద్దమౌతున్నారు. అఖిలపక్షంలో కాంగ్రెస్ వైఖరి కోసం ఎదురు చూస్తున్నారు. నిజానికి టి ఎంపీల చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో అధిష్టానం పై ఒత్తిడి పెంచి తెలంగాణపై సానుకూల నిర్ణయం కోసం ప్రయత్నించాలని తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. సమావేశాల సమయంలో సభలోకి వెళ్లకుండా బయటనే తెలంగాణ కోసం ఆందోళన చేపట్టారు. అయితే అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ రాష్ర్టంలోని పార్టీలను కేంద్రం ఆహ్వానిస్తూనే... కొందరు ఎంపీల కోరిక మేరకే ఆల్ పార్టీ భేటీ నిర్వహిస్తున్నట్టు స్పష్టంగా తెలిపింది. ఈ విషయమే టి ఎంపీలకు జీర్ణించుకోలేని విధంగా తయారైంది. తమ ఒత్తిడి మేరకు కేంద్రం నిర్వహిస్తోన్న అఖిలపక్షంలో...కాంగ్రెస్ తెలంగాణకు అనుకూల అభిప్రాయం చెప్పకపోతే పరిస్థితేంటనే చర్చించికుంటున్నారు. తెలంగాణపై కాంగ్రెస్ స్పష్టతివ్వకున్నా... పార్టీలో కొనసాగడం కన్న రాజకీయ సన్యాసం తీసుకోవడం మేలని అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more