రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత పార్టీ నాయకులే విమర్శలు చేయటం మనకు తెలిసిందే. అయితే ఆయన మంత్రి వర్గంలోనే శత్రువులు ఉన్నవిషయం తెలిసిందే. అయితే ఆయన అన్నింటికి మౌనంతో సమాధానం చెబుతూ అమ్మతో దగ్గర మార్కులు కొట్టేస్తున్నారు. ఎంతో మంది నాయకులు అమ్మకు ఫిర్యాదు చేసిన ముఖ్మమంత్రి పదవికి చేటు రాకుండా చూసుకుంటున్నారు సీఎం కిరణ్. ఈ ముఖ్యమంత్రి మాకొద్దు.. అతన్ని మార్చాండి అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు , అందరు కలిసి అమ్మకు విన్నపం ఇచ్చిన ఫలితం లేకుండాపోయింది. కానీ మన రాష్ట్రానికి వైద్యుడు, మన రాజకీయాలను బాగు చేయటానికి వచ్చిన కేరళ ఆయుర్వేద డాక్టర్.. కూడా మన సీఎం ముఖ్యమంత్రి మీదనే ఏలేత్తి చూపుతున్నారు. ఇక్కడ రాష్ట్రం నాయకులు చేతిలో అవమానం జరిగింది అనుకుంటే.. కేంద్ర నాయకులు చేతిలో కూడా మన రాష్ట్రం పరువు పోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేంద్రమంత్రి వయలార్ రవి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పై ఎందుకు విమర్శలు చేస్తున్నాడు అంటే? మన దేశం నుండి అనేక మంది విజిటింగ్ వీసాలపై అక్కడికి వెళ్లి రాలేకపోయిన అనేక మంది ప్రజలు ఉన్నారు. పనులు కోసం వెళ్లి వీసా సమయం గడిచిపోవటంతో.. అనేక మంది భారతీయులు ఇతర దేశల్లో అనేక కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని దేశాలకు వారిని ఇండియా పంపించటానికి ఒప్పుకుంది.
మన రాష్ట్రం నుండి అనేక మంది పేద ప్రజలు ఇతర దేశల్లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భంలో కేరళ రాష్ట్రానికి సంబందించిన ప్రజలపై కేంద్ర మంత్రి వయాలర్ రవి ప్రత్యేక శ్రద్ద తీసుకొని వారిని ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఆంద్రప్రదేశ్ నుండి ఎలాంటి స్పందన లేకపోవటంతో మన రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పలేదు. యూఏఈలో అనధికారింగా తలదాచుకుంటున్న వారిందరికీ క్షమాభిక్ష ప్రసాదించి స్వదేశాలకు పంపడానికి అక్కడి ప్రభుత్వం సిద్దమైన ..డబ్బులేక వారు అక్కడే నిస్సహయ స్థితిలో నిలిచిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం అక్కడున్న వారి రాష్ట్ర ప్రజలకు అన్ని ఖర్చులు పెట్టుకొని భారత్ కు రప్పించడానికి కేంద్ర మంత్రి వయలార్ రవి ముందుకు వచ్చారు. అయితే మన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదని వయలార్ రవి అన్నారు. ఆంద్రప్రదేశ్, కరీంనగర్ జిల్లా నుండి 10 వేల మంది ప్రజలు నిస్సహాయస్థితిలో నిలిచిపోయారన్నారు. అన్ని రాష్ట్రాల మఖ్యమంత్రులకు లేఖ రాసినట్లు వయలార్ రవి అంటున్నారు. అయితే ఆంద్రప్రదేశ్ సీఎం దీని ఎలాంటి స్పందన లేదని ఆయన చెబుతున్నారు. సీఎం కిరణ్ దీనిపై ముందుకు రాలేదని, అందువలనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అక్కడే నిలిచిపోయారని ఆయన అన్నారు. సీఎం కిరణ్ స్పందించి ఉంటే మీ రాష్ట్ర ప్రజలను రప్పించటానికి కేంద్రంతో చర్చలు జరపటం జరగుతుందని ఆయన వయలార్ రవి మీడియావారితో అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more