యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చెందుకు ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ అందుకు వివిధ పార్టీల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఫైర్బ్రాండ్ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ.. లోక్సభలో విపక్ష నేత సుష్మాస్వరాజ్కు ఫోన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఆమెను కోరారు. ఈ విషయం బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్వయంగా వెల్లడించారు. అయితే, సుష్మాస్వరాజ్ ప్రస్తుతం బాల్ ఠాక్రే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ముంబై వెళ్లినందున, ఆమె ఢిల్లీ వచ్చాక తామంతా ఈ విషయంపై చర్చిస్తామని జోషి చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఎన్డీయే సమావేశం జరుగుతుందన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించేందుకు కావల్సిన మెజారిటీ ఉందా అన్న ప్రశ్నకు.. అందుకే దీనిపైస చర్చిస్తామని అన్నారు. సంఖ్యాబలం సరిపోని పక్షంలో ప్రభుత్వం మరో ఆరునెలల వరకు సురక్షితంగా ఉంటుందని.. ఒకవేళ ప్రభుత్వం పడిపోతే తర్వాత ఏం చేయాలో కూడా ఆలోచించాల్సి ఉందని ఆయన అన్నారు.
ఎస్సీ, బీఎస్సీలు యూపీఏకు బయటనుంచి మద్దతిస్తున్నందున ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న టీఎంసీ ఆలోచన సరైనదేనా అని అడగ్గా, ఎఫ్డీఐలను వ్యతిరేకించడం సరైనదేనని. అయితే ఒకవేళ వాళ్లు అవిశ్వాసం పెడితే పరిణామాలను ఆమోదించాల్సింది కూడా వారేనని జోషి చెప్పారు.మమతా బెనర్జీ ఇటు బీజేపీతోను అటు వామపక్షాలతోను కలిసి ప్రవేశపెట్టాలని చూస్తున్న అవిశ్వాస తీర్మానం 305 మంది ఎంపీల బలం కింద పడి కుప్పకూలుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. కేవలం 19 మంది సభ్యులున్న తృణమూల్ లాంటి పార్టీ అవిశ్వాసం పెడతామని ప్రకటించిందంటే, అది కేవలం బీజేపీ, సీపీఎంలతో వారి సాన్నిహిత్యాన్నే చూపిస్తోందని ఆయన విమర్శించారు. తాము విశ్వాసం పొందాలంటే కేవలం 272 మంది సభ్యుల మద్దతు సరిపోతుందని, కానీ.. ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, జేడీ (ఎస్)లతో కలిపి తమకు 305 మంది మద్దతు ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more