ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టులపై సీఎం కిరణ్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్తున్నారు. ఇప్పటికే మహిళా కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి నేదురు మల్లి రాజ్యలక్ష్మికి, తెలుగుభాష అధికార సంఘం అధ్యక్షులుగా మండలి బుద్ద ప్రసాద్ నియమాకానికి సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల పందేరం మొదలైంది. ఆశావహులు ఎంతో కాలంగా ఎదురు చూస్తుండటంతో 73 రకాల పోస్టులకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే స్థాయి నుంచి సీఎం వరకు ఎవరికి వారు తమ అనుచరులకు పదవులు కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టిన ముఖ్యమంత్రి రెండు మూడు దఫాల్లో పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం తన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మికి మహిళా ఛైర్మన్, మండలి బుద్దప్రసాద్ కు అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమించినట్లు సమాచారం. మహిళా కమీషన్ చైర్మన్ ను రెండు నెలల్లో భర్తి చేయాలని హై కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు..
ఇక తెలుగు భాష అధికార సంఘం అధ్యక్షులు గా మండలి బుద్ద ప్రసాద్ కు కెటాయించడం పై కూడా కారణంగా ఉంది..డిశంబర్ లో అంతర్జాతీయ తెలుగు మహసభలు తిరుపతిలో జరగనున్నాయి..ఈ నేపద్యంలో నే వీరిఇరువురుని మొదటగా నియమాకానికి సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా తమ వర్గం ఆశావహుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తమ వర్గాన్ని బలపరుచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఓ వైపు బొత్స ,మరోవైపు మంత్రులు, ఇంకోవైపు చిరంజీవి తమ తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు కట్టాబెట్టాలని సీఎం పై తీవ్ర స్థాయిలోనే వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు ఎవరి స్థాయిలోనే వారే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు ఇది మంచి అవకాశమని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తుండటంతో....పోస్టుల భర్తీ సిఎం కు సవాల్ గానే మారిందని ముఖ్యమంత్రి సన్నిహిత మంత్రులు చెప్తున్నారు. పదవులు దక్కని వారు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పదవులు దక్కని నేతల్ని ఆకట్టుకునేందుకు, తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసీపీ తలుపులు తెరచిపెట్టింది. దీంతో సీఎం ఆచూతూచి అడుగులేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more