ప్రముఖ మేగజీన్ ఫోర్బ్స్ రూపొందించిన ‘ప్రపంచంలో వంద మంది శక్తిమంతులైన మహిళల జాబితా-2012 లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరో స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది ఇదే జాబితాలో ఆమె ఏడో స్థానంలో నిలిచారు. రాజకీయాలు, వాణిజ్యం తదితర రంగాల్లో సత్తా చూపిన వారితో రూపొందించిన తాజా జాబితాను ప్రకటించారు. ఇందులో సోనియాతోపాటు మరో నలుగురు భారత మహిళలు చోటు ద క్కించుకున్నారు. పెప్సీకో సీఈఓ ఇంద్రానూయీ 12, సిస్కో సిస్టమ్స్ చీఫ్ టెక్నాలజీ-స్ట్రాటజీ అధికారి పద్మశ్రీ వారియర్ 58, ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ చందా కొచ్చర్ 59, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 80వ స్థానాల్లో నిలిచారు. సోనియా గత ఏడాది అనారోగ్యానికి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసుకుని, తిరిగి పోరాట స్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని ఫోర్బ్స్ కొనియాడింది.
ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ఓ సభ్యుడి(అద్వానీ)పై తీవ్రంగా విరుచుకుపడ్డారంది. ‘కాంగ్రెస్ చరిత్రలోనే ఆ పార్టీకి సుదీర్ఘకాలం నేతృత్వం వహిస్తున్న ఆమె ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత తనను, పార్టీని రక్షించుకోవాల్సి వచ్చింది. అత్యధిక ఆర్థికవృద్ధికి ఆమె ప్రశంసలందుకున్నారు. అలాగే రాజకీయ అవినీతిని సహిస్తున్నారని, యువ ఓటర్లకు చేరువ కాలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. కళలపైఆసక్తి ఉన్న ఆమె తైలవర్ణ చిత్రాల పరిరక్షణలో డిగ్రీ పుచ్చుకున్నారు’ అని తెలిపింది. కాగా, గత ఏడాది ఈ జాబితాలో తొలిస్థానం దక్కించుకున్న జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ మళ్లీ అదే స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెను ‘యూరప్ ఉక్కు మహిళ’ అని పత్రిక పొగిడింది. తాజా జాబితాలో అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ 2, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ 3, మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహాధ్యక్షురాలు మిలిండా గేట్స్ 4, న్యూయార్క్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జిల్ అబ్రామ్సన్ 5, అమెరికా ప్రథమ మహిళ మిషల్ ఒబామా 7వ స్థానాల్లో నిలిచారు. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్సాన్ సూకీ, టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ఫ్రే, నటి ఏంజెలినా జోలీ తదితరులూ జాబితాలో ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more