రైతులు మంచి పంటలు పండించడం కూడా పాపమేనా..? విధానపరిషత్లో అటవీశాఖ మంత్రి సి.పి.యోగీశ్వర్ సమాధానం విని ఉపసభాపతి స్థానంలో ఉన్న విమలాగౌడకు కూడా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మంత్రిగారూ.. ఏమిటీ వరుస.. సభ్యుల ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు ఒక్కసారి చదవకుండానే సంతకం పెట్టేస్తున్నారా..? ఇదేం బాగోలే దు.. అంటూ ఆమె మండిపడ్డారు. అసలు విషయంలోకి వెడితే.. ఏనుగులు అరణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చి పడుతున్నాయని రైతుల పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయని వీటి బారినుంచి రైతాంగాన్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలంటూ జేడీఎస్ సభ్యుడు నాణయ్య ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు అధికారులు సదరు మంత్రిగారికి సమకూర్చిన సమాధానం దిమ్మతిరిగేలా ఉంది. అడవిలో ఆహారానికి తీవ్ర కొరత వచ్చి పడిందట. పైగా దున్నలు, ఏనుగులకు మధ్య ఆహారం విషయంలో తీవ్ర పోటీ ఏర్పడిందట. దీంతో ఏనుగులు పచ్చటి పొలాలవైపు కన్నేశాయట. పైగా రైతులు అరటి, చెరకు తదితర నోరూరించే పంటలు పండిస్తుండడంతో వీటికి రుచి మరిగి పదే పదే జనారణ్యంలోకి వస్తున్నాయట. ఈ సమాధానం విన్నాక సీనియర్ సభ్యుడు నాణయ్యకు చిర్రెత్తుకొచ్చింది. మంత్రి ఇలా బాధ్యతారహితంగా అజ్ఞానంతో సమాధానం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. చివరికి మంత్రి క్షమాపణ కోరడంతో వివాదం ముగిసింది. రామదాస్పై బీజేపీ ఎమ్మెల్యే ధ్వజం శాసనసభ సాక్షిగా వైద్యవిద్యాశాఖ మంత్రి రామదాస్పై బీజేపీ ఎమ్మెల్యే సార్వభౌమభగిళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డఘటన సోమవారం చోటుచేసుకుంది. కరువుపై చర్చ సమయంలో జోక్యం చేసుకున్న భగిలి మాట్లాడుతూ జెనరిక్ ఔషధాల పేరిట ప్రజలకు కుచ్చుటోపీ వేస్తున్నారని మార్కెట్ ధరతో పోలిస్తే ఈ మందుల ధరలు పది రెట్లు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. మంత్రి రామదాస్, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఈ మొత్తం వ్యవహారంలో కుమ్మక్కయ్యారన్నారు. నైతికత ఉంటే తక్షణం రాజీనామా చేయాలని మంత్రిని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more