ఆయనో సైంటిస్టు... తనలాంటి వారిని సృష్టించాలనుకున్నాడో ఏమో... ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 600 మంది పిల్లలకు తండ్రయ్యాడు. 20ఏళ్ల కాలంలో ఇంతమందికి ప్రాణం పోశాడు..! సంతానం కోసం పరితపించేవారికి తన ఫెర్టిలిటీ(ఫలదీకరణ) క్లినిక్ ద్వారా 1940 నుంచి 1960 మధ్య వీర్యం దానం చేశాడు. 1972లో ఆ సైంటిస్టు మృతిచెందగా, ఆయన అతిపెద్ద కుటుంబం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఓ పత్రిక సదరు క్లినిక్ను సందర్శించి ఆరా తీయగా 600 మందికి క్లినిక్ అధినేత తండ్రయ్యాడని తేలింది. ఆ తండ్రి పేరు డాక్టర్ వీస్నర్. లండన్లో బార్టన్ ఫెర్టిలిటీ క్లినిక్ను ఆయన కొనసాగించేవారు. తన వద్దకు సంతాన లేమితో వచ్చే దంపతులకు వీర్యం దానం చేసేవారు. అలా 20ఏళ్ల పాటు క్లినిక్ ద్వారా తన వీర్యం దానం చేస్తూవచ్చాడని ‘డెయిలీ మెయిల్’ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more