పార్టీలకతీతంగా తెలంగాణవాదులు ఏకమై జెఎసి ఏర్పాటుకు బీజం వేశారు. కాలక్రమంలో జెఎసికి టిడిపి, కాంగ్రెస్ దూరమైనా... ఉద్యమం మాత్రం ఉధృతంగా సాగింది. శ్రీకృష్ణ కమిటీ పేరుతో తెలంగానాపై ఏడాది కాలయాపన చేసిన కేంద్రం...ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సకల జనుల సమ్మెతో 42 రోజుల పాటు సకలం స్తంభించినా కేంద్రంలో పెద్దగా కదలిక రాలేదు. రెండేళ్ల పాటు ఉదృతంగా సాగిన ఉద్యమం... ఇప్పుడు కొంత చల్లబడ్డట్టు కన్పిస్తున్నా...ఇది తుఫాను ముందు ప్రశాంతతగానే తెలంగాణావాదులు భావిస్తున్నారు. తెలంగాణాకు వ్యతిరేకంగా ప్రకటన వచ్చిన డిసెంబర్ 23 ను నమ్మకద్రోహ దినంగా పేర్కొంటూ గ్రామగ్రామాన యుపిఎ శవయాత్రలకు జెఎసి పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం...త్వరలో ఓ నిర్ణయం వెలువరించనుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే అది రాష్ర్టంలో ప్రకంపనలు రేపుతుందో...లేదా ప్రశాంతతకు కారణమౌతుందో వేచిచూడాలి.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more