పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ టాప్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ గుజ్జర్ భారత భద్రతా బలగాలకు చిక్కాడు. కాశ్మీర్ లోయలో అశాంతిని రగిల్చేందుకు కొత్తగా ఆర్మీ రిక్రూట్ మెంట్ కు పాల్పడుతూ.. గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న తాలిబ్ హుస్సేన్ ను ఇవాళ సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్న సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), రాష్ట్రీయ రైఫిల్స్ దళాలకు చిక్కాడు. కాగా, జమ్మూకశ్మీర్లోని కిష్టావర్లోని నాగ్సినీ తహశీల్ రష్గ్వాన్ మధ్యమలోని ఓ ఇంట్లో తలదాచుకుంటున్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
భారత భద్రతా దళాలు తన కోసం అన్వేషిస్తున్నాయన్న సమాచారం అందుకున్న గుజ్జర్.. తన పేరును మార్చుకుని.. నాగ్సినీ తహశీల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కాశ్మీర్ లోయలో హింసను ప్రేరేపించేందుకు ఉగ్రవాదంలోకి చేరికలను నిర్వహిస్తున్న ఆయన పెద్ద అలజడి సృష్టించేందుకు కూడా పథక రచన చేస్తున్నాడు. ఈ క్రమంలో భద్రతాదళాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ప్రాంతంలో గుజ్జర్ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న బలగాలు 17 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ కలిసి గాలింపు చర్యలు చేపట్టాయి. గుజ్జర్ స్థావరాలపై దాడులు చేసి అతడిని సజీవంగా పట్టుకున్నాయి.
అతడిని సజీవంగా పట్టుకోగలిగామని, ఇది నిజంగా గొప్ప విజయమని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఉగ్రవాది జహంగిర్ సరూరి అలియాస్ మొహమ్మద్ అమీన్ భట్కు గుజ్జర్ అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో అతడి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, భట్, గుజ్జర్ ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు కలిసే ఉన్నారు. లోయలో పలు ఉగ్రదాడులకు పాల్పడిన గుజ్జర్ కోసం కొన్నేళ్లగా గాలిస్తున్న బలగాలు ఎట్టకేలకు అతడిని పట్టుకోగలిగాయి. తాలిబ్ గుజ్జర్ కు కిష్త్వార్ జిల్లాలోని నాగ్సిని, మార్వా, దచ్చన్, పాడర్ ప్రాంతంలోని స్థానిక కొండ మార్గాల గురించి తెలియడంతోనే అతను తప్పించుకు తిరుగుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more