టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు పెద్దఎత్తున వైసీపీ కార్యకర్తలు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అంతటితో అగని వైసీపీ కార్యకర్తలు విశాఖ విమానాశ్రయానికి చేరకునే పలు రహదారులపై బైఠాయించి నిరసనను వ్యక్తం చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అయితే విశాఖ విమానాశ్రాయానికి తమ అధినేత వస్తున్నాడన్న సమాచారం టీడీపీ కార్యకర్తలు కూడా రావడంతో.. వైసీపీ కార్యకర్తలకు పోటీగా వారు కూడా నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది,
విశాఖ విమానాశ్రయం నుంచి చంద్రబాబు బయటకురాగానే ఆయన కాన్వాయ్ కి అడ్డంగా వైసీపీ కార్యకర్తలు పడుకున్నారు. దీంతో కాన్వాయ్ నిలిచిపోయింది. దాదాపు రెండు గంటల సమయం చంద్రబాబు తన వాహనంలోనే కూర్చుండి పోయారు. మధ్యమధ్యలో తన వాహనం నుంచి దిగి తమ కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ.. కారులోనే కూర్చుండిపోయారు. అయితే వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వున్న కారణంగా పోలీసులు చంద్రబాబును విమానాశ్రయం లాభీలోనే కూర్చోమని.. ట్రాఫిక్ క్లియర్ చేసిన తరువాత తాము సందేశానిస్తామని చెప్పారు. అయితే అందుకు సమ్మతించని చంద్రబాబు కారులోనే కూర్చున్నారు.
దాదాపు రెండు గంటల పాటు అలాగే కూర్చున్నా పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయకపోవడంతో ఒక దశలో పాదయాత్రగా బయల్దేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆయనను వారించడంతో తిరిగి మళ్లీ వాహనంలోనే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్ పైకి చెప్పులు, కొడిగుడ్లు, టామాటాలు విసిరారు. అయితే అవి ఆయన వాహనశ్రేణిపై పడలేదు. విమానాశ్రయం నుంచి ఎన్ఏడీ కూడలి వరకు వివిధ ప్రాంతాల్లో రహదారిపై వైసీపీ శ్రేణులు బైఠాయించడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రభుత్వం పథకం ప్రకారమే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు.
వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చంద్రబాబును అడ్డుకుంటున్నారని విమర్శించారు. రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తరలించారని టీడీపీ నాయకురాలు అనిత ఆరోపించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలకు కొమ్ముకాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇలాంటి చర్యల ద్వారా అధికార వైసీపీ ప్రభుత్వ దిగజారుడు తననానికి నిదర్శనమని విమర్శించారు. ఇది ప్రతిపక్షంపై ప్రభుత్వం చేయించిన దాడిగా అభివర్ణించారు. ప్రశాంతంగా వుండే విశాఖను.. ఎలా మారుస్తున్నారో తెలియజేయడానికి ఇది ట్రైయిలర్ మాత్రమేనని.. విశాఖ ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని, లేదంటే వైసీపీ సినిమా చూపించడం ఖాయమని టీడీపీ నేతలు విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more