దేశప్రజలను వంచించి అక్రమ మార్గాల ద్వారా అదాయాన్ని సమకూర్చుకున్న వారికి ఎక్కడున్న అందలం ఎక్కించే సిబ్బంది, అధికారులు వారి విధి నిర్వహణను మాత్రం నామమాత్రంగానే చేపడుతూ.. తమ జేబులు నిండకపోతే.. ఎంతటివారికైనా యాచకస్థితిని కల్పిస్తారన్నది తేటతెల్లమైవుతుంది. ఓ వైపు నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో దోషిగా తేలిన అబ్దుల్ కరీం తెల్గీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్థుల కేసులో దోషిగా తేలిన శశికళకు జైలులో రాజభోగాలు అందుతున్నాయని పిర్యాదులు చేసే అధికారులు.. ఖైదీలకు కల్పించాల్సిన కనీస వసతులను కల్పించకుండా వారిని అఖరి క్షణాలివే అన్న దిశగా పయినింపజేస్తున్న దారుణ పరిస్థితులపై మాత్రం నోరు మెదపరు.
మావోయిస్టులతో సంబంధాలు వున్నాయన్న అభియోగాలతో ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా తాను జైలులో అనుభవిస్తున్న దయనీయ పరిస్థితి తన భార్యకు లేఖ ద్వారా రాయడంతో శిక్ష పేరున ధనవంతులకు జరుగుతున్న దొడ్డిదారి సేవలే కాదు.. సాధారణ ఖైదీల దయనీయస్థితులను కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. రాజద్రోహ నేరం మోపబడి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాను నాగ్ పూర్ కేంద్రీయ కారాగారంలోని అండాసెల్ లో ఉంచారు.
తాజాగా ఆయన తన తన ఆరోగ్యపరిస్థితిపై సతీమణికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న సాయిబాబా.. తన ప్రాణాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని, నేలమీద పాకుతూ ఓ జంతువులా తాను బతుకుతున్నానని, తనకు స్వెట్టర్ కానీ, కనీసం కప్పుకునేందుకు దుప్పటి కానీ ఇవ్వలేదని, నవంబర్ మాసంలో గడ్డకట్టుకుపోయే చలిని తట్టుకొని తాను బతకడం అసాధ్యమైన విషయమని లేఖలో పేర్కొన్నారు.
త్వరగా సీనియర్ న్యాయవాదితో మాట్లాడి తన ప్రాణాలను కాపాడాలని కోరారు. తన గురించి పట్టించుకోవాలంటూ జైలు అధికారులను పదే పదే ఒక బిక్షగాడిలా ప్రాధేయపడాల్సి రావడం కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ తొలి వారంలో బెయిలు పిటిషన్ దాఖలు చేయాలని లేఖలో కోరారు. అలా జరగకపోతే తన పరిస్థితి చేయిదాటిపోతుందని పేర్కొన్నారు. ఇదే చివరి ఉత్తరం అని, ఇక మీదట తానీ విషయాన్ని రాయబోనని కూడా లేఖలో తేల్చిచెప్పారు. తనను పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా సాయిబాబా వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more