మన భారతదేశంలో వున్న అన్ని ప్రదేశాలలో గర్వించదగ్గ ప్రాంతాలలో దేశ రాజధాని అయిన ఢిల్లీ ఒకటి. ఇక్కడికి విహరించడానికి ప్రపంచంలోని అనేక దేశాల పర్యాటకులు విచ్చేస్తుంటారు. ఢిల్లీలో ఆకర్షించే ప్రాంతాలు చాలానే వున్నాయి. ఢిల్లీ పర్యటన చేయడం కూడా అతి తక్కువ ఖర్చుతో కూడిన పని. ఢిల్లీ అన్ని రంగాలలో ముందున్న రాజ్యం. ఇక్కడ వ్యాపార రంగాలు, పారశ్రామిక రంగాలు ఎంతో ప్రముఖపాత్రను వహిస్తాయి.
ముఖ్యంగా ఇక్కడున్న మెట్రో రైలు ఎంతో పేరుపొందింది. మీరు ఢిల్లీ ఎక్కడైన విహరించాలనుకుంటే... మెట్రోరైలు ద్వారా అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో వివిధ ప్రాంతాలను విహరించవచ్చు.
చాందిని చౌక్ :
ఢిల్లీలో వున్న పర్యాటక ప్రాంతాలలో ఇది ఎంతో ముఖ్యమైంది. ఇక్కడ విహరించడానికి గౌరీ శంకర్ టెంపుల, దిగంబర్ జైన్ టెంపుల్, సీష్ గంజ్ గురుద్వారా, రెడ్ ఫోర్ట్, ఫతేపూర్ మసీద్, జామా మసీద్, సలీమ్ ఘడ్ పోర్ట్ వంటి ప్రాంతాలు ఎంతో ఆకర్షణీయమైనవి. వీటిని వీక్షించడానికి పర్యాటకులు దేశ, విదేశాల నుంచి లక్షల్లో వస్తుంటారు. ఇది ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశం. ఇది ఎల్లో లైన్ లో వుంటుంది.
రాజీవ్ చౌక్ :
ఈ ప్రాంతం కూడా ఎంతో ప్రముఖమైంది. ఇక్కడ చూడడానికి కొన్నాట్ ప్లేస్, జంతర్ మంతర్, జనపథ్, లక్ష్మీనారాయణ మందిన్, బంగ్లా సాహెబ్ గురుద్వారా, బాబా ఖురాక్ సింగ్ మార్గ్ స్టేట్ ఎంపోరియం శంటి ప్రదేశాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. ఇక్కడ షాపింగ్ చేయడానికి అనువుగా చాలా కాంప్లెక్స్ లు వుంటాయి. ఇది బ్లూ లైన్ లో వుంటుంది.
ఇంద్రప్రస్థ :
ఇది కూడా బ్లూ లైన్ లో కలదు. ఈ ప్రదేశంలో గార్డెన్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్, కుతుబ్ మీనార్ లు చూడడానికి ఎంతో ఆహ్లాకరంగా వుంటాయి. ఇది ఢిల్లీ చూడదగ్గ ప్రదేశాలలో ఒకటి.
ప్రగతి మైదాన్ :
ఈ ప్రగతి మైదాన్ లో హస్తకళలకు సంబంధించిన మ్యూజియం, నేషనల్ సైన్స్ సెంటర్ లు ఎంతో ఆకర్షణీయమైన ప్రదేశాలు. ఇక్కడ చాలావరకు ఎగ్జిబిషన్ లు, నాటకాలను నిర్వహిస్తుంటారు. ఇవి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా వుంటాయి.
అక్షరధామ్ :
హిందువులకు సంబంధించిన ప్రార్థనస్థలాలలో ఒకటైన అక్షరధామ్ ఒకటి. ఇక్కడ నిత్యం పర్యాటకులు విహరిస్తూనే వుంటారు. ఎటువంటి కుల, మత, జాతి భేదాలు లేకుండా అన్యమతాలవారు నిత్యం వస్తూనే వుంటారు. ఇది భారతదేశంలోనే ఒక ముఖ్యమైన ప్రదేశంగా పిలువబడుతుంది.
కల్కాజి టెంపుల్ :
ఇక్కడ కూడా అన్యమతాలవారు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా పర్యటిస్తారు. ఇది మెట్రో స్టేషన్ వయోలెట్ లైన్ లో కలదు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్, లోటస్ టెంపుల్స్ కూడా సందర్శించుకోవచ్చు.
రేస్ కోర్స్ :
ఇది కూడా మెట్రో రైల్వేలోని ఎల్లో లైన్ లో కలదు. ఇది ఎంతో ప్రముఖమైన ప్రదేశం. ఇక్కడ మహాత్మాగాంధీజి స్మృతి, బిర్లా హౌస్ వంటి ప్రదేశాలు చూడటానికి చాలా అందంగా వుంటాయి.
జోర్ బాగ్ :
ఇక్కడ పర్యటించేందుకు గల ఆకర్షన ప్రదేశాలయిన హుమాయూన్ టూంబ్, సఫ్దర్ జంగ్ టూంబ్, లోది గార్డెన్, హజరత్ నిజాముద్దీన్ దర్గా, ఇండియా హబిటాట్ సెంటర్ లు మొదలైనవి చూడవచ్చు. ఇవి నిత్యం పర్యాటకులతో నిండి వుంటాయి.
సెంట్రల్ సెక్రటేరియట్ :
ఈ ప్రదేశంలో ఇండియా గేటు, ఇందిరా గాంధి మెమోరియల్, జవహర్ లాల్ నెహ్రు మెమోరియల్, పురానా కిలా, సంస్కృతి మ్యూజియం, రాష్ట్ర పతి భవన్, లోడి గార్డెన్, నేషనల్ గేలరీ అఫ్ మోడరన్ ఆర్ట్, ది పార్లమెంట్ హౌస్, బిర్లా మందిర్, సఫ్దర్జంగ్ టూంబ్, నేషనల్ జూలాజికల్ పార్క్, నేషనల్ రైల్ మ్యూజియం మొదలైన ఆకర్షణలు చూడవచ్చు.
(And get your daily news straight to your inbox)
Apr 24 | ప్రస్తుతకాలంలో వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. యుక్తవయస్కుల నుంచి 60 ఏళ్లు పైబడినవారు కూడా ప్రతిఒక్కరు కారును నడుపుతున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్లు కూడా ఎక్కడబడితే అక్కడ జరుగుతున్నాయి. అయితే తాజాగా నిర్వహించిన సర్వేల్లో.. యాక్సిడెంట్లలో... Read more
Mar 24 | ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి ఎంతో సుందరమైన ప్రకృతి దృశ్యాలదాకా గుజరాత్ రాష్ట్రం నానాటికీ అభివృద్ధి చెందుతూనే వుంది. సంస్కృతి సంప్రదాయాలపరంగా, వ్యాపారపరంగా, విహరించడానికి అనుగుణంగా ఈ ప్రదేశం ప్రతిఒక్కరిని ఆకర్షిస్తూనే వుంది. ప్రముఖ నటుడయిన... Read more
Mar 17 | మొత్తం ప్రపంచంలోనే భారతదేశంలో ఎంతో అద్భుతమైన హిమాలయ శ్రేణుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతం ఎప్పుడూ పర్యాటకులతో నిండి వుంటుంది. చిన్న, పెద్ద, వయస్సుతో ఎటువంటి తేడా లేకుండా ప్రతిఒక్కరు... Read more
Mar 13 | దక్షిణ భారతదేశంలోనే ప్రయాణికులకు ‘‘వెల్లూర్’’ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించబడింది. ఈ ప్రాంతంలో పురాతనకాలం నుంచి వున్న కట్టడాలు, దేవాలయాలు, ద్రావిడ నాగరికతలను సంబంధించిన చారిత్రాత్మక కట్టడాలు ఇక్కడ వున్నాయి. హిందూ సంస్కృతీ,... Read more
Mar 10 | ఒరిస్సా రాష్ట్రంలోని మూడు ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ‘గోపాల్పూర్’ ఒకటి. ఇది ఒరిస్సాలోని దక్షిణ సరిహద్దులైన్లపై వున్న ఒక కోస్తా పట్టణం. ఇది బంగాళఖాతానికి చాలా సమీపంలో వుండడంవల్ల ఎంతో ప్రసిద్ధి చెందింది. కాలంతో... Read more