అమృత ప్రాప్తి మంత్రం :
శంఖినీ యక్షిణీ సాధన మంత్రం
శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా
ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని జపించేముందు ఉదయాత్పూర్వం ప్రారంభించి, సూర్యోదయానికి ముందుగానే ముగించుకోవాలి. నెయ్యితో వెయ్యిసార్లవరకు ఈ మంత్రాన్ని హవనం చేస్తే.. చంద్రికా యక్షిణీ ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ మంత్రం ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరుపడితేవారు జపించకూడదు. అన్నివిధాలుగా పవిత్రంగా వుండేవారికి మాత్రమే ఇది వర్తస్తుంది. అటువంటివారికే పలితాలు దక్కుతాయి. ఇతరుల ఎంతచేసినా ఫలితం శూన్యం.
రుణ విముక్తి కోసం చిన్న పూజ :
రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఇందులో కూరుకుపోయినవారు బయటపడ్డం చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడ్డానికి అన్యరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యంకాదు. కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యపడుతుంది. అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా వుంది.
దీపావళి పండుగరోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో 5 గులాబీ పూలను తెచ్చుకోవాలి. తరువాత ఒకటిన్నర మీటరు పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకుని, మీ ముందు పరుచుకోవాలి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోవాలి. తరువాత ఐదు గులాబీలను గాయత్రీమంత్రాన్ని పఠిస్తూ.. ఆ తెల్లటి వస్త్రంలో వుంచాలి. ఆ విధంగా తయారుచేసుకున్న దానిని భగ్రంగా ఒకచోట దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే.. త్వరగా మీరు రుణ విముక్తి పొందుతారు.
గాయత్రి మంత్రం :
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే ఈ మంత్రాన్ని జపించడంతో సిరిసందదలతోపాటు ప్రత్యేకమైన లాభాలు కూడా కలుగుతాయి.
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ,
ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా!
ప్రతిరోజూ తొమ్మిదిసార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. మంత్రాన్ని జపించిన తరువాత పసుపురంగులో వున్న మిఠాయిలను పిల్లలకు పంచాలి. అలాగే గంగాజలాన్ని మీరు పనిచేసే చోట జల్లుకోవడంతో మంచి పురోభివృద్ధిని పొందుతారు. అలాగే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలు పొందుతారు.
ఆకర్షణ వృద్ధి కోసం :
పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్న స్థానంలో ఒక బంతి పూవులను తీసుకోవాలి. ఆ పూలను పసుపుతో పూజించి, నీటితో చిదుముకోవాలి. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకుంటే.. మిమ్మల్ని చూసేవారు మీవైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వివాహసంబంధాలకు వెళ్లినప్పుడు దీనిని పాటిస్తే.. మంచి ప్రయోజనాలు పొందుతారు.
(And get your daily news straight to your inbox)
Jun 12 | హిందూ శాస్త్రాలలో పాదరసం ప్రాముఖ్యత - మహిమలు : పూర్వం దేవతల కాలంనుంచి పాదరసానికి ఎంతో ప్రత్యేకత వుంది. పాదరసం అసలు పేరు ‘‘ఏఅసరాజు’’. ఇది చూడడానికి దేవతామూర్తుల రూపంలో కనువిందు చేస్తుంటుంది. ప్రాచీనకాలంలో... Read more
May 10 | హిందూ దేవతలలో వినాయకుడిదే అగ్రస్థానం. దేవతలు కూడా తమ పనులను నిర్వర్తించుకునేముందు వినాయకుడిని దర్శించుకుని, విజయాలను సాధించేవారు. అలాగే సామాన్య ప్రజలు కూడా తమరోజువారి పనులలో, కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలు, సమస్యలు రాకుండా నిర్విఘ్నంగా... Read more
Apr 03 | కార్తీకమాసంలో ఎంతో పవిత్రమైన, విశిష్టమైన క్షీరాబ్ది ద్వాదశిరోజు తులసీ పూజను నిర్వహించుకుంటారు. కార్తీకమాసంలో వచ్చే శుక్లపక్షద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు ముత్తైదువులు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిలను భక్తిశ్రద్ధలతో పూజించి, వారి వివాహాన్ని జరుపుకుంటారు. ఆ... Read more
Mar 19 | భీష్మపితామహుడికి సంతానం లేకపోయినా... ఆయన మరణించిన తరువాత ఇప్పటికీ పితృతర్పణాలు అందుతూనే వున్నాయి. అంతటి మహత్తరమైన వ్యక్తిగా భీష్ముడు భారతకథలో నిలిచిపోయిన మహోన్నతుడు. ఈయనకు ఇంత మహత్యం లభించడానికి కారణం ఆయన గుణశీలాలే. 45రోజులపాటు... Read more
Mar 15 | ఆశ్వయుజ అమావాస్యనాడు... అంటే దీపావళి ముగిసిన రెండురోజుల తరువాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈరోజుని వారు శివరాత్రితో సమానమైన పర్వదినంగా కొలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని... Read more