(Image source from: why should we do pooja for trees)
హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి మన భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించడం ఆచారంగా వస్తోంది. అందులో ముఖ్యంగా తులసీ మొక్కలను ఇంటి గుమ్మం ఎదురుగా పెంచుకుని, ఉదయాన్నే లేవగానే ప్రత్యేక పూజలను నిర్వహించుకుంటారు. అలాగే కొన్ని జంతువులను కూడా పవిత్రంగా భావించడం ఇప్పటికీ మనం గమనించవచ్చు. అయితే కొంతమంది ఇటువంటి వాటిని మూఢనమ్మకంగా వ్యవహరించి అస్సలు పట్టించుకోరు. మరికొందరికి ఇలా ఎందుకు చేస్తారో తెలియదు కానీ నిత్యం పూజలు మాత్రం చేస్తూనే వుంటారు. ఆ విధంగా పూజలు ఎందుకు నిర్వహిస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం....
యావత్ సృష్టినే ఏర్పాటు చేసిన ఆ భగవంతుడు మానవ సంరక్షణ కోసం మొక్కలు, జంతువులను సృష్టించాడు. మనలో ఏ విధంగా అయితే దేవుడు జీవశక్తిగా వున్నాడో... అలాగే వృక్షాలలో, జంతువులలో కూడా కొలువై వున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన ఆనాటి పూర్వీకులు.. అప్పటి నుంచే వీటిని ఎంతో పవిత్రంగా పరిగణించడం జరిగింది. అంతేకాకుండా... మానవుని దైనందిన జీవితం కూడా ఈ వృక్షాలు, జంతువుల మీదే ఆధారపడి వుంది. మానవునికి కావలసిన ప్రాణవాయువు (ఆక్సిజన్)ను మొక్కలు ప్రసాదిస్తాయి. పోషక విలువలు కలిగిన పళ్లను, ఔషదాలను ప్రసాదిస్తాయి.
అలాగే జంతువుల నుంచి వస్త్రాలు, వసతులు కూడా లభిస్తాయి. మానవుని ప్రాణాధారానికి కావలసిన ఎన్నో వనరులను ఇవి సమకూరుస్తాయి. ఇవి మాత్రమే కాకుండా.. మన చుట్టూ వున్న పరిసరాలను అందంగా మార్చి, మనలో ఆహ్లాదాన్ని పెంపొందిస్తాయి. దీనిని బట్టి చూస్తే.. మనం వాటికి ఎటువంటి ఉపకారం చేయకపోయినా అవి మనకు ఎంతగానో సహాయపడుతున్నాయి. మానవుల నుంచి ఏమీ కోరుకోకుండా నిస్వార్థంగా జీవకోటికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అందువల్ల మన పూర్వీకులు వీటిని ఎంతో భక్తితో పూజించి, అంతరించిపోకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకునేవారు.
సాధారణంగా ఈ వృక్ష, జంతు సమూహాలు మానవజాతి కంటే ముందే భూమి మీద ఏర్పడ్డాయి. అయితే మానవ సమూహం సృష్టించబడినప్పటి నుంచి వాటికి ఎంతో నష్టం కలుగుతోంది. మానవుడు తన అవసరాల మోతాదుకు మించి అనేక రకాలుగా ఉపయోగించడం వల్ల అవి అంతరించిపోతున్నాయి. దీనిని ముందే గ్రహించిన పూర్వీకులు, చెట్లను ఎంతో పవిత్రంగా చూసుకోవాలని, వాటికి నిత్యం పూజలు నిర్వహించుకోవాలని బోధిస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ వాటిని పట్టించుకోవడం లేదు.
పురాతన గ్రంథాల ప్రకారం.. చెట్లను నరికేయడం వల్ల ‘‘శూనా’’ అనే పాపం వస్తుందని, దానివల్లే జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కుంటారని పేర్కొనబడింది. అందువల్ల చెట్లను నరకకూడదని గ్రంథాలలో చెప్పబడి వుంది. ఒకవేళ చెట్లను నరికేస్తే.. ఆ శూనా అనే పాపం తగలకుండా వుండడానికి ముందు క్షమాపణ చెప్పుకోవాలని, అందుకు చెట్లను పూజించాలని శాస్త్రాలలో రచించబడివున్నాయి. మౌనంగానే వుంటూ మనకు ప్రాణానికి అవసరమైన వనరులను అందించడంతోపాటు జ్ఞానాన్ని, పాఠాలను బోధిస్తున్న ఈ చెట్ల గొప్పతనాన్ని ప్రతిఒక్కరు తెలుసుకుని, వాటిని పవిత్రంగా భావించి, ప్రకృతిని కాపాడుకోవడం అసలైన నాగరికులుగా మన బాధ్యతను నిర్వర్తిస్తామని ఆశిస్తూ....
(And get your daily news straight to your inbox)
Apr 21 | శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. విసుక్కోవడం సంగతి పక్న బెడితే అసలు కాలు ముందుకు కదపకుండా వెనక్కి తిరుగుతారు. నిజంగా.. పిల్లి మొహం చూస్తే పంచ... Read more
Jan 11 | పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా, పట్టు వస్త్ర ధారణ, ఆడవారికీ - మగవారికీ కూడా సూచించింది హిందూ సాంప్రదాయం. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో,... Read more
Jan 09 | మౌనము అంటే, ముని వ్రుత్తి... మునులు ఆచరించే విధానం అని అర్ధం. మనకు పంచ జ్ఞ్యానేన్ద్రియాలు ఉన్నాయి. శరీరం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు. వీటన్నిటికీ మౌనాన్ని ఇవ్వడమే మౌన వ్రతాన్ని ఆచరించడం. శరీరాన్ని... Read more
Jan 07 | బల్లి ... ఈ పేరు వినగానే, ఈ పేరుకి అధిపతి అయిన జీవిని చూడగానే, మనకే తెలియని ఛీదరింపు, మనల్ని ఆవహిస్తుంది... ఇళ్ళల్లో గూడలకి అతుక్కుని ఉండే బల్లి పొరపాటున మనమీద, లేక వంటకాల... Read more
Jan 06 | సీతా దేవి, మారు వేషంలో ఉన్న రావణాసురుడికి భిక్ష వేసేందుకు లక్ష్మణ రేఖ దాటే ముందు, ఆమె కుడి కన్ను అడిరిందట... ఒకానొక మహా కవి, తన రామాయణంలో ఈ అంశాన్ని పొందుపరిచారు...కళ్ళు అదరడం,... Read more