Telugu desam nara chandrababu naidu to end padayatra with public meeting

nara chandrababu naidu to end padayatra with public meeting,, nara chandrababu naidu, padayatra, tdp, telugu desam party, lokesh babu, bhuvaneswari, tdp leaders, vastunna meekosam padayatra, april 27, padayatra to end on april 27th

nara chandrababu naidu to end padayatra with public meeting

చంద్రబాబు కుటుంబసభ్యుల ఆత్మీయ సమావేశం

Posted: 04/26/2013 04:41 PM IST
Telugu desam nara chandrababu naidu to end padayatra with public meeting

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర శనివారంతో ముగియనుండడంతో విశాఖలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 207 రోజుల పాటు తనతో పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలు, సిబ్బందితో ఆయన కుటుంబసభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోక్‌శ్ పాల్గొన్నారు. కార్యకర్తలకు, సిబ్బందికి స్వయంగా చంద్రబాబు, భువనేశ్వరి భోజనాలు వడ్డించారు. కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరిస్తూ, ఫొటోలు దిగారు. పాదయాత్ర కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రేపు జరగబోయే ముగింపు సభకు భారీ ఏర్పాట్లు చేశారు.

207 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర శనివారంతో ముగియనుంది. దీంతో ముగింపు సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున విశాఖలో ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 250 మంది నేతలు కూర్చునే విధంగా భారీ స్టేజీని ఏర్పరుస్తున్నారు. ఈ ముగింపు సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు విజయస్థూపాన్ని(పైలాన్) ఆవిష్కరించనున్నారు. ముగింపు సభకు దాదాపు 5 లక్షల మంది రానున్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో మహాత్మాగాంధీ, జ్యోతిరావు పూలే, అంబేద్కర్, ఎన్.టి. రామారావు, ఎర్రన్నాయుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ ముగింపు సభలోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more