Cm kiran speech in rachabanda

CM Kiran speech in Rachabanda, CM Kiran Racha Banda Program in tirupathi, Rachabanda, international cricket stadium in Tirupati, Chief Minister N Kiran Kumar Reddy

CM Kiran speech in Rachabanda, CM Kiran Racha Banda Program in tirupathi

రచ్చబండ రసాభాస- క్రికెట్ స్టేడియానికి సీఎం శంకుస్థాపన

Posted: 11/21/2013 09:07 PM IST
Cm kiran speech in rachabanda

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యాక్రమం ముఖ్యమంత్రి కిరణ్ సొంత జిల్లాలో రచ్చ రచ్చ అయ్యింది. అధికార పార్టీ ఎంపీ చింతా మోహన్ కు రచ్చబండలో చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో ఈరరోజు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీని సమస్యలు పరిష్కరించాలంటూ నిలదీశారు. సమస్యలపై సరైన సమాధానం రాకపోవటంతో ఆగ్రహించిన మహిళలు.... ఎంపీపై బాటిళ్లు విసిరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో చింతా మోహన్ కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు.

 

ఇదే రచ్చబండ కార్యక్రమంలోనే సీపీఎం కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఎంపీ చింతా మోహన్ సమైక్యవాదుల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. కాగా సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

స్టేడియానికి సీఎం శంకుస్థాపన

తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు సీఎం బుధవారం శంకుస్థాపన చేశారు. తిరుపతి ఎస్‌వీ జూ పార్కు సమీపంలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.30 కోట్ల అంచనాతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని చేపట్టనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు రూ.7,200 కోట్ల అంచనాతో చేపట్టిన తాగునీటి సరఫరా పథకానికి, స్విమ్స్‌లో పద్మావతీ మహిళా వైద్య కళాశాలకూ సీఎం శంకుస్థాపన చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles