టీమిండియా మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడినప్పుడు ఆ జట్టులో సభ్యుడిగా ఉన్న తనకు ఇన్నాళ్లకు మళ్లి జట్టులో స్థానం లభించింది. అయితే ఈ మధ్యలో మాత్రం ఆయన చాలా అనుభవాన్నే గడించారు. టీమిండియా టీ20 జట్టులో స్థానం కోల్పోయి.. అప్పుడప్పుడు తలుక్కున మెరుస్తూ.. వివిధ కారణాలతో జట్టులోకి వస్తూ పోతూనే ఉన్నాడు. చివరకు ఆశలు వదిలేసుకొని కామెంటేటర్ అవతారమూ ఎత్తాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అతని రోల్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పష్టత ఇవ్వడంతో చెలరేగిపోయాడు.
అంతే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతనే కర్ణాటక స్టార్ బ్యాటర్ దినేష్ కార్తీక్. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో ఐపీఎల్ పుణ్యమా అని టీమిండియా తలుపు తట్టాడీ వికెట్ కీపర్ బ్యాటర్. 37 ఏళ్ల వయసులో భారత జట్టులో పునరాగమనం చేసి, తొలిసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేస్తున్న అతన్ని టీ20 ప్రపంచకప్లో ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఐపీఎల్లో అదరగొడుతున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయంపై మాట్లాడిన డీకే.. టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున ఆడటమే తన కోరిక అని చెప్పాడు. ఇప్పుడు ఆ కల నెరవేరడంతో డీకే ఆనందానికి హద్దులేకుండా పోయింది. టీ20 ప్రపంచకప్ జట్టులో తన పేరు ఉండటంతో ‘కలలు నిజం అవుతాయి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డీకే క్రికెట్ కెరీర్ ఏదో చందమామ కథలా ఉందంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Dreams do come true
— DK (@DineshKarthik) September 12, 2022
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more