ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో భారత్ 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటివరకూ జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ల్లో భారత్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. అద్భుత బ్యాటింగ్తో రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో 97, రెండో ఇన్నింగ్స్లో 103 పరుగులతో కోహ్లీ విజృంభించిన సంగతి తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులు చేయగా, భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 161 పరుగులకే కుప్పకూలింది.
ఇక రెండో ఇన్నింగ్స్లో ఇండియా 7వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించగా, ఇంగ్లండ్ 317 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్ల విజృంభణకు ఇంగ్లండ్ తొలి సెషన్లోనే 62 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బట్లర్, స్టోక్స్ అద్భుత ఆటతీరును కనబరుస్తూ సెంచరీ భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగించారు. బట్లర్ (106) శతకం, స్టోక్స్ (62) అర్ధ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడారు.
దీంతో నాల్గవ రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 102 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. చివరి సెషన్లో బుమ్రా కొత్త బంతితో మాయ చేస్తూ ఐదు వికెట్లతో రాణించాడు. అయితే టెయిలెండర్లు మాత్రం తమ పట్టు వీడకపోవడంతో మ్యాచ్ ఫలితం కోసం భారత్ ఐదో రోజు వరకు ఆగక తప్పలేదు. ఐదో రోజు క్రీజులోకి వచ్చిన అండర్సన్, రషీద్ ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కేవలం మూడు ఓవర్లలోపే వికెట్ కోల్పోయిన మ్యాచ్ ను టీమిండియా చేతిలో పెట్టింది ఇంగ్లాండ్.
ఐదువ రోజు ఆట ప్రారంభమైన తరువాత పట్టుమని పది నిమిషాలు కూడా ఆడలేకపోయిన ఇంగ్లాండ్ టెయిల్ ఎండర్లను భారత్ టెస్టు మ్యాచ్ స్పిన్ దిగ్గజం అశ్విన్ పెవిలియన్ కు పంపారు. తన బౌలింగ్లో క్యాచ్ ఇవ్వడంతో అండర్సన్ తిరుగుముఖం పట్టాడు. మ్యాచ్ ముగిసే సమయానికి అండర్సన్(11), రషీద్(33) పరుగులతో నాటౌట్గా నిలిచాడు. బూమ్రాకు 5వికెట్లు, ఇషాంత్ శర్మకు 2, అశ్విన్కు 1, మహ్మద్ షమీకి 1, హార్థిక్ పాండ్యాకు ఒక వికెట్ దక్కింది. అయిదు టెస్ట్ల సీరిస్లో ఇంగ్లండ్ 2, ఇండియా 1 టెస్ట్ గెలిచాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more