నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్టు లో టీమిండియా విజయభేరి మ్రోగించింది. టీ-ట్వంటీ, వన్డే సిరీస్ల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిని చవిచూసిన టీమిండియా.. అసలైన క్రికెట్ కు బాష్పం చెప్పే టెస్టు సీరిస్ లో ప్రతీకారం తీర్చుకుంది. గాంధీ-మండేలా సిరీస్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ, వన్డే సిరీస్లను కోల్పోయిన భారత్..దక్షిణాఫ్రికాతో జరుగుతున్ననాలుగు టెస్ట్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 కైవసం చేసుకుంది. మూడవ టెస్టులో భారత్ దక్షిణాప్రికాపై పరుగుల విజయాన్ని సాధించింది.
32/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 185 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 124 పరుగులతో ఘనవిజయాన్నిసాధించింది. ఆమ్లా, డుప్లెసిస్ కొద్ది సేపు ప్రతిఘటించినా మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా పోరాడలేకపోవడంతో భారత్ మూడు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ను ముగించేసింది. భారత బౌలర్లలో అశ్విన్ 7, మిశ్రా 3 వికెట్లు పడగొట్టారు. మొహలీ, నాగ్పూర్ మ్యాచ్లలో భారత్ గెలవగా బెంగళూరులో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మొదటి టెస్టుల తరహాలోనే మూడో టెస్ట్ లోనూ ఇరు వైపులా స్పిన్నర్ల హవా కొనసాగింది. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు పడగోట్టిన రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాన్ అప్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టీమిండియా స్కోరు:
తొలి ఇన్నింగ్స్ 215 పరుగలు
రెండో ఇన్నింగ్స్ 173 పరుగులు
దక్షిణాప్రికా స్కోరు:
తొలి ఇన్నింగ్స్ 79 పరుగలు
రెండో ఇన్నింగ్స్ 185 పరుగులు
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more