హంపి
ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామం. విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది. ఎన్నో దేవాలయాలకు నిలయమైన ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది.