జయలలితకు కుష్బూ సవాల్..!

 

త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జయలలిత తన నియోజకవర్గమైన ఆర్కేనగర్ నుండి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే నియోజకవర్గం నుండి దేవి అనే హిజ్రా కూడా పోటీ చేస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పటికే ఈ పోటీపై ఆసక్తి పెరగగా.. ఇప్పుడు కాంగ్రెస్-డీఎంకే కూటమి కూడా ఆర్కే నగర్ నియోజక వర్గం నుండి కుష్బూను రంగంలోకి దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి అనుకున్నది అనుకున్నట్టు జరిగి.. కుష్బూని కనుక రంగంలోకి దింపితే పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది.