కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్ సినిమాలు విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రతి వారం ఓ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఇంకా విడుదల తేదీపై క్లారిటి ఇవ్వటం లేదు. ఆ సినిమానే ‘విరాట పర్వం’.
రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నీదినాది ఒకేకథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ మూవీని అన్ని చిత్రాలతో పాటే వాయిదా వేశారు. మిగితా చిత్రాలు మాత్రం వరుసగా విడుదలవుతుంటే, విరాట పర్వం మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేకపోతుంది. దీనికి ముఖ్య కారణం సరేష్బాబు అంటూ ప్రచారం సాగింది. సురేష్బాబు నారప్ప, దృశ్యం సినిమాల మాదిరిగానే విరాట పర్వం చిత్రాన్ని కూడా నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు గతం నుంచి ప్రచారం అవుతుంది.
అయితే ఈ వార్తలపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకే చాలా వరకు సినిమాలు విడుదల తేదిలను ప్రకటించాయి. దాంతో సరైన తేదీ చూసి ‘విరాటపర్వం’ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్లో ఇటు ఫ్యామిలీ... Read more