నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ థియేటర్లలో సందడి చేస్తుండగానే.. మరోవైపు 102వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దర్శకుడు కె. ఎస్. రవికుమార్ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఒక కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకున్నారు. ఆల్రెడీ ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొంటోంది. ఇక రెండవ కథానాయికగా 'నటాషా దోషి'ని ఎంపిక చేసినట్టుగా సమాచారం. కథానాయికగా నటాషా దోషికి మలయాళంలో మంచి గుర్తింపు వుంది. హైడ్ అండ్ సీక్, మాంత్రికన్, నయన చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఈ నేపథ్యంలోనే ఆమె బాలకృష్ణ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుందని అంటున్నారు. ఇక మూడవ కథానాయికగా ఎవరిని తీసుకుంటారో చూడాలి. జయసింహా అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ బరిలో నిలవనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more