అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ‘ఊపిరి’ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. నేడు ఈ సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా వీక్షించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.... పివిపి బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రసాద్ నిర్మించిన చిత్రం ఊపిరి ఎంతో చక్కగా ఉంది. ఎంతో ఆసక్తికరంగా, అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా అర్థవంతమైన విలువలతో అఖరి వరకు సినిమా సాగింది. సినిమా అన్న తర్వాత వినోదమన్నా ఉండాలి, వ విజ్ఞానమన్నా, సందేశమైనా ఉండాలి. ఈ చిత్రంలో ఈ మూడు అంశాలు ఉన్నాయి. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుగారిని తలపించేలా అక్కినేని నాగార్జున చాలా గొప్పగా నటించారు. క్లిష్టమైన పాత్ర, అందులో అందరి మనసులు చూరగొనే విధంగా నటించడం గొప్ప విషయం. కార్తీ కూడా చాలా సహజంగా, ఉషారుగా నటించాడు. సినిమా నాకైతే బాగా నచ్చింది. మంచి కథ, నటన, సందేశం ఉంటే సినిమా చక్కగా ఆడుతుందని నిరూపించిన చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. ప్రేమ, అనురాగం, అనుబంధం వాటి సమ్మిళితం బాగా నచ్చింది. ఉద్వేగంగా ఉంది. పాత రోజుల సినిమాలు ఇప్పుడు రావడం లేదని అనుకునే ఈరోజుల్లో ఇలా అన్నీ ఎలిమెంట్స్ సినిమా రావడం సంతోషం. ఈ చిత్రంలో నటించిన నటీనటుల, పనిచేసిన టెక్నిషియన్స్ ను అభినందిస్తున్నాను. ఇంత మంచి సినిమా తీసిన పివిపిగారికి నా ప్రత్యేకమైన అభినందనలు అన్నారు.
నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ.... మా ఊపిరి చిత్రాన్ని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. కేంద్రమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ వెంకయ్యనాయుడుగారు రాత్రి నాకు ఫోన్ చేసి సినిమా గురించి చాలా గొప్ప విషయాలు వింటున్నాను. ప్రపంచ వ్యాప్తంగా సినిమా బాగా ఆడుతోందని తెలిసింది. సినిమా చూడాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ఆయన కోసం ఈ స్పెషల్ షో ఏర్పాటు చేశాం. ఈ చిత్రాన్ని చూసి ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని పొందానని వెంకయ్య నాయుడు గారు చెప్పడం నాకెంతో సంతృప్తిని కలిగించింది. ఆయన ప్రసంశలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. నాగార్జునగారిని, కార్తీని, వంశీ పైడిపల్లితో పాటు యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించినందుకు హ్యపీగా ఉంది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more