ప్రస్తుతం ఇండియన్ ఇండస్ట్రీలో సంచలన ప్రేమ జంట ఏది అంటే.. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు రణబీర్, కత్రినా అని ఠక్కున చెప్పేస్తారు. ఎందుకంటే.. తొలుత సల్మాన్ తో ప్రేమాయణం నడిపిన కత్రినా.. ఆ తర్వాత వెంటనే రణబీర్ పై మనసు పారేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సల్మాన్ లాంటి అగ్రహీరోని వదిలేసి.. రణబీర్ లాంటి కుర్రహీరోతో ఈ అమ్మడి రిలేషన్ ఎలా కుదిరిందా? అంటూ కొన్నాళ్లవరకు బాలీవుడ్ లో చర్చలు కొనసాగాయి. ఇంకో అబ్బురపరిచే విశేషం ఏమిటంటే.. ఎప్పటినుంచైతే ఈ లవ్ బర్డ్స్ ప్రేమలో వున్నారో.. అప్పటినుంచి విచ్చలవిడిగానే తమ సహజీవనాన్ని ఆస్వాదిస్తూ వస్తున్నారు.
గతంలో ఈ జంట ఇటువంటి వార్తలను దాటవేస్తూ వస్తోంది కానీ.. వారు తమ వ్యక్తిగత జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగులతో వీరిద్దరు బిజీగా వున్నప్పటికీ.. ఫ్రీగా సమయం దొరికినప్పుడల్లా ఏకాంతంగా కాలం గడుపుతుంటారు. అంతేకాదు.. ప్రతిఏటా తమకు నచ్చిన లొకేషన్ కి వెళ్లి.. అక్కడ తమ ఏకాంత సమయాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ తరహాలోనే తాజాగా వీరిద్దరు సమ్మర్ హాలిడే కోసం మాల్దీవుల్లో ల్యాండ్ అయ్యారు. భానుడి ప్రతాపంలో చల్లని వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఈ ప్రేమజంట ఈ హాట్ లొకేషన్ కి వలస వెళ్లారని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి అక్కడి ఎయిర్ పోర్టులో దిగుతుండగా.. ఎవరో ఒకరు ఫోటో తీశారు. ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
రెండేళ్ల క్రితం స్పెయిన్ లోని బీచ్ ప్రాంతంలో కత్రినా బికినీలో కనువిందు చేయగా.. ఆమెతోపాటు రణబీర్ నేక్డ్ గా కనిపించి వార్తల్లోకెక్కారు. ఈసారి మాల్దీవుల్లో కూడా వీరు అలాగే దర్శనమిచ్చే అవకాశముందని అంతా అనుకుంటున్నారు. ఏదిఏమైనా.. ఈ జంట పెళ్లికి ముందే ఈ జంట ఇలా విచ్చలవిడిగా సహజీవనాన్ని ఆస్వాదిస్తూ నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more