తెలుగు రాష్ట్రాల్లోని తమ కస్టమర్లకు ఎయిర్ టెల్ మరో సదుపాయాన్ని దగ్గర చేసింది. ఇన్నాళ్లు కేవలం ఢిల్లీ వరకు మాత్రమే పరిమితమైన వైఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. డేటా కనెక్షన్, రీచార్జ్ లేకున్నా, వైఫై సదుపాయంతో కాల్ చేసుకునే సౌకర్యాన్ని తీసుకు వచ్చామని పేర్కొంది. మరింత మెరుగైన వాయిస్ కాలింగ్ అనుభూతి కలుగుతుందని, ఏ నెట్ వర్క్ లోని కస్టమర్లకైనా వైఫై ద్వారా కాల్స్ చేసుకోవచ్చని, రిసీవ్ చేసుకోవచ్చని, ఇందుకు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొంది.
ఈ విషయాన్ని ఎయిర్ టెల్ తెలుగు రాష్ట్రాల సీఈఓ అన్వీస్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని కస్టమర్లకు తొలుత అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక ఈ సదుపాయం పొందేందుకు ఎటువంటి యాప్ అవసరం లేదని, వైఫై కాలింగ్ కు మద్దతిచ్చేలా తాజా వర్షన్ కు ఫోన్ సిస్టమ్ ను అప్ గ్రేడ్ చేసుకుంటే చాలని అన్వీస్ సింగ్ వెల్లడించారు. ఈ వై-ఫై కాలింగ్ సేవలను పొందేందుకు తొలుత వివోఎల్టీఈ సర్వీసును అన్ చేసుకోవాలి. ఆపై మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ లో వైఫై కాలింగ్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు. అదెలా అంటే..
మొబైల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సిమ్ అండ్ నెట్ వర్కింగ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయాలి. అక్కడ ఎయిర్ టెల్ సిమ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓ పాప్ అప్ బాక్స్ లో యాక్టివేట్ మేక్ కాల్స్ యూజింగ్ వైఫై అనే అప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వైఫై కాల్స్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం ఐఫఓన్ ఎక్స్ అర్, 6ఎస్ ఆపై వెలువడిన అన్ని యాపిల్ ఫోన్లతో పాటు, శాంసంగ్ జే6, ఏ 10, ఒన్ 6, ఎస్ 10, ఎస్ 10 ప్లస్, ఎస్ 10ఈ, ఎం 20లతో పాటు వన్ ప్లస్ 7 సీరీస్ ఫోన్లు, రెడ్ మీ 5, కే 20, కే 20 ప్రో, షావోమి పోకో ఎఫ్1 ఫోన్లన్నీ ఈ వైవై కాలింగ్ ను సపోర్ట్ చేస్తాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more