ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ ఆయా ప్రాంత రైతులు ఇవాళ్టి నుంచి మరో విడత మహాపాద్ర చేపట్టిన విషయం తెలిసిందే. అమరావతి సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల రైతులు.. గతంలో తిరుమల తిరుపతికి పాదయాత్రగా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని తిరుపతిలో సభ ఏర్పాటు చేసుకుని తిరుగు పయనమైన రైతులు తాజాగా మరోమారు పాదయాత్ర చేపట్టారు. వారి పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా పాదయాత్రను కాస్తా ఫేక్ యాత్రగా అభివర్ణించారు. దాంతో మంత్రి అంబటిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్లో కూడా నెటిజెన్లు అంబటిపై తీవ్ర విమర్శలు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.
అమరావతి రైతుల మహా పాదయాత్ర ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనాసాగించాలనే డిమాండ్తో రైతులు గతంలో కూడా మహా పాదయాత్ర చేపట్టారు. కాగా, వారు చేపట్టిన ఆందోళనకు 1000 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని మరో విడత మహాపాదయాత్రకు పూనుకున్నారు. రైతుల పాదయాత్రపై ఆగ్రహంతో ఉన్న మంత్రి అంబటి రాంబాబు.. ట్విట్టర్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ‘అది మహా ఫేక్ యాత్ర’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఆ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి రాస్తున్నట్లు వెల్లడించలేదు.
మంత్రి అంబటి రాంబాబు ట్వీట్పై నెటిజెన్లు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేస్తున్న పాదయాత్రపై ఇలా మంత్రి తన అక్కసును వెళ్లగక్కడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జగన్ చేపట్టిన పాదయాత్రను ఏమంటారు అంబటి? అంటూ ప్రశ్నించారు. డైలాగులు చెప్పమంటే భలే చెప్తారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుల గురించి నీ బాధ మొసలికన్నీరేనా అని నిలదీశారు. కాగా, రైతుల మహా పాదయాత్రపై మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తీవ్రంగా స్పందించారు. గురజాడ బతికుంటే రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయ్.. 26 జిల్లాలోయ్ అనే వారేమో అంటూ సెటైరికల్గా ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more