హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తింది. జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీరు దిగువకు విడుదల చేయడంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలసంద్రంగా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి మూసీకి భారీగా చేరుతున్న వరద నీటితో పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరదనీరు దిగువకు వస్తుండటంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సహయక బృందాలు లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
దీంతో మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు పునరావాసాలకు తరలించారు. ఉస్మాన్ సాగర్ 15 గేట్లకు గాను.. 13 గేట్లు ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. మరో గేటును సైతం ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. వరదనీరు ఉద్ధృతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇళ్లు నీట మునిగిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ముందస్తు చర్యలు తీసుకున్నారు. కాగా, జంట జలాశయాలకు క్రమంగా వరద ఉద్దృతి తగ్గుతోంది. ఉస్మాన్సాగర్ ఇన్ఫ్లో 7,500 క్యూసెక్కులు కాగా.. ఔట్ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్సాగర్ ఇన్ఫ్లో 7వేల క్యూసెక్కులు కాగా.. 8 గేట్లు ఎత్తి 7,708 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో బ్రిడ్జిని పోలీసులు మూసివేశారు. బ్రిడ్జి పైనుంచి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండడంతో నిన్నటి నుంచే రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం వరకు వంతెనపై నుంచి మూసీ వరద కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్న అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో అంబర్పేట - కాచిగూడ, మూసారాంబాగ్ - మలక్పేట మార్గాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో దిల్సుఖ్నగర్, మలక్పేట, చాదర్ఘాట్, కోఠి రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
ఈ క్రమంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఉద్ధృతంగా ప్రవసిస్తోన్న మూసీతో మూసారాంబాగ్ లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరిన శంకర్నగర్, మదర్స ప్రాంతాల్లోని స్థానికులను.. రత్నానగర్, పటేల్నగర్, గోల్నాక ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. వర్షం వచ్చినప్పుడల్లా తమకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని.. శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more