ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోంది. భారత ప్రభుత్వం జారీ చేసిన అదేశాలకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో ఆర్జి దాఖలు చేసింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్తర్వులు అందాయి. ప్రభుత్వ చర్యలపై దుష్ప్రచారం చేస్తున్న పోస్టులను తొలగించాలని కొత్త ఐటీ రూల్స్ చెప్తున్నాయి.
అయితే వీటిలో కొన్ని రిక్వెస్ట్లు సమంజసంగా లేవని ట్విట్టర్ తన పిటీషన్ లో పేర్కోంది. తమ భారత ఖాతాదారుల భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వ అదేశాలు భంగం కలిగించేలా ఉన్నాయని ట్విట్టర్ కేసు వేసింది. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన అధికారిక ఖాతాలు పెట్టిన పోస్టులను తొలగించాలని తమకు ఆదేశాలు వచ్చాయని, కానీ అలా చేయడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను తుంగలో తొక్కేయడమేనని ఈ సోషల్ మీడియా సంస్థ వాదిస్తోంది. దేశ భద్రతకు, హింసను ప్రేరేపించే పోస్టులను తామ సిబ్బంది తొలగిస్తున్నారని ట్విట్టర్ సంస్థ పేర్కోంది.
కాగా, ఇతర పార్టీ నేతలు, పెట్టిన పోస్టులతో పాటు ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పెట్టిన పోస్టులను కూడా తొలిగించాలని భారత ప్రభుత్వం కోరుతోందని.. ఇది వారి అభిప్రాయాల భావవ్యక్తీకరణ హక్కుకు విఘాతం కల్పించమే కదా అని పేర్కోంది. అయితే కొత్త ఐటీ రూల్స్ ప్రకారం, దేశ భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల కంటెంట్ ప్రజలకు అందుబాటులో లేకుండా బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాము చెప్పిన కంటెంట్ను తొలగించకపోతే క్రిమినల్ కేసులు పెడతామని భారత ఐటీ శాఖ అధికారులు చెప్తున్నారని, ఇది అధికార దుర్వినియోగమని ట్విట్టర్ ఆరోపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more