మహారాష్ట్ర పర్యటనలో ఔరంగజేబు సమాధిని దర్శించుకుని, నమాజ్ చేసిన మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చర్యను అధికార శివసేన, ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తాయి. ఈ చర్యలతో శాంతియుతంగా వున్న మహారాష్ట్రలో విద్వేషాలు రగల్చాలని ఎంఐఎం భావిస్తోందిని శివసేన అరోపించింది. అలాంటి చర్యలతోనే కనక మజ్లిస్ ప్రణాళికలో ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చిరించింది. ఇక ఇదే సమయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నావిస్ కూడా ఎంఐఎం ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారు.
ఔరంగాబాద్ జిల్లా ఖుల్దాబాద్ లో ఔరంగజేబు సమాధిని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించారు. అనంతరం అక్కడ నమాజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఔరంగజేబును కీర్తించడం ద్వారా అక్బరుద్దీన్ ఒవైసీ భారతీయ ముస్లింలను అవమానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ‘‘ఔరంగజేబును కీర్తించే ప్రయత్నాన్ని అక్బరుద్దీన్ చేశారు. ఇది జాతీయ భావం కలిగిన ముస్లింలను అవమానించినట్టు. ఈ దేశంలోని ముస్లింలకు ఔరంగజేబు ఎంత మాత్రం ఆరాధ్యుడు కాడు. శంభాజీరాజాను చంపడానికి ముందు అతడిని హింసించాడు’’ అని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
ఔరంగజేబును ఏ రూపంలో కీర్తించాలన్నా తాము అందుకు ఏమాత్రం అంగీకరించబోమని అన్నారు. ప్రజలను హింసించి పాలించే రాజుగా ఆయన అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఆయన మరణించిన తరువాత ఇన్నాళ్లకు ఆయన సమాధిని దర్శించి.. నమాజ్ చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలా చేసేవారు ప్రతిచర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ‘ఎవరో ఒకరు లీలావతి హాస్పిటల్ (ఎంపీ నవనీత్ రాణా ఎంఆర్ఐ గది వద్ద ఫొటో తీసుకోవడం) వద్ద ఫొటో తీసుకున్నారని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కానీ, ఈ విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు’’ అని ఫడ్నవిస్ విమర్శించారు.
ఈ విషయంపై శివసేన కూడా తీవ్రంగానే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఔరంగజేబు. ఆయన సమాధి ముందు నమాజ్ చేయడం అంటే ఒవైసీ సోదరులు మహారాష్ట్రను సవాలు చేయడమే. ఒవైసీ సోదరులు రాజకీయం చేస్తున్నారు. ఈ మట్టిలోనే ఔరంగజేబును పాతిపెట్టాం. ఆయన అనుచరులు ఎవరైతే ఇక్కడ రాజకీయాలు చేయాలని చూస్తున్నారో వారికీ అదే గతి పడుతుంది’’ అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. అయితే, ఖుల్దాబాద్ కు ఎవరొచ్చినా ఔరంగజేబు సమాధిని సందర్శించడం మామూలేనని, ఇందులో భిన్నమైన అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more