పెళ్లంటే నూరేళ్ల పంట. ఎవరి జీవితంలోనైనా కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే మహావేడుక. అప్పటివరకు ఒకరికి ఒకరు తెలియకుండానే.. ఒక్కటై.. ఓకరికి ఒకరై.. జీవితాంతం తోడుగా ఉండే చక్కని బంధం. కష్టనష్టాలలో.. ఇష్టాయిష్టాలలో.. త్యాగనిరతిని పెనవేసుకునే బహుచక్కని బంధం. అలాంటి బంధాన్ని అందరూ అపురూపంగా కాపాడుకుంటారు. కానీ కోందరు పెళ్లి అనే బంధాన్ని కూడా మోసంతో ముడివేస్తున్నారు. పెళ్లి పేరిట 100 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఫర్హాన్ ఖాన్గా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి ఓ బీఎండబ్ల్యూ కారు.. ఏటీఎంలు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఓ మ్యాట్రిమోనియల్ పోర్టల్లో తాను ఓ వ్యక్తిని కలిశానని తాను ఓ అవివాహితుడనని చెప్పున్న ఆ వ్యక్తి.. బిజినెస్ డీల్ పేరిట ఆమె నుంచి రూ.15లక్షలు దోపిడీ చేశాడని ఏయిమ్స్కు చెందిన ఓ వైద్యురాలు సౌత్ ఢిల్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన ఫర్హాన్ మ్యాట్రిమోనియల్ సైట్లలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి.. వర్కింగ్ మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. నిందితుడు చదివింది కేవలం ఇంటర్మీడియట్ మాత్రమేనని.. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు.
తన తల్లిదండ్రులు చనిపోయారని మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలలో పేర్కొన్న నిందితుడు.. వాటి ద్వారా అవివాహిత యువతులను లక్ష్యంగా చేసుకుని వారిని సంప్రదించి, వారితో ఎంతో కలవిడిగా, నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. ఆ తర్వాత వారు తన ట్రాప్ లో పడ్డారని తెలుసుకున్న తరువాత.. వారికి ఏవో సాకులు చెప్పి.. వారి నుంచి డబ్బులు తీసుకోనే వాడు. అలాగే ఎయిమ్స్ చెందిన మహిళా వైద్యరాలిని సైతం మోసం చేయగా.. సదరు మహిళ మార్చి 26న పోలీసులకు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఎందరినో మోసం చేసినా.. కోందరు తప్ప మిగతావారందరూ నిమ్మకుండిపోయారు.
అయితే వైద్యురాలి ఫిర్యాదు మేరకు డీసీపీ బెనిటా మేరి ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 18 రోజుల పాటు బృందం కష్టపడి నిందితుడిని పట్టుకుంది. సదరు వ్యక్తి పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మహిళలను మోసం చేసినట్లు పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా ఫర్హాన్ మహిళలను మోసం చేస్తున్నాడని చెప్పారు. తనకు వ్యాపారాలు ఉన్నాయని, ఎంబీఏ, ఇంజినీరింగ్ చదివినట్లు మహిళలకు చెప్పి వారిని నమ్మించే వాడని ఆ తర్వాత వారి నుంచి డబ్బులు వసూలు చేశాక వారితో సంబంధాలను కట్ చేసుకునేవాడని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 12 | భారతదేశ 75 ఏళ్ల వజ్రోత్సవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కేంద్రప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. 75 ఏళ్ల స్వతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా... Read more
Aug 12 | ప్రభుత్వ పెద్దలు ప్రచారాల కోసం చెప్పేది ఒకటి.. కానీ వాస్తవిక పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఎదుర్కోనేది మరోకటి అంటూ ఇన్నాళ్లు దేశంలోని పేదలు చెబుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలే లేవు. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలకు.. ఆచరణలో... Read more
Aug 12 | నడిరోడ్డుపై మహిళతో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నా అక్కడి జనం చోద్యం చూశారు. నలుగురైదుగురు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం అక్కడ వేడుక చూస్తున్న మనుషులకు లేకుండా పోయింది. ఆకాశంలో సగం అంటూ మహిళల హక్కుల కోసం నినదిస్తున్న... Read more
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more
Aug 11 | అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు... Read more