కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా కొత్త వేరియంట్లుగా పరివర్తన చెంది ప్రపంచదేశాలపై దాడి చేస్తూనే వుంది. యావత్ ప్రపంచ మానవాళిపై తీవ్రప్రభావం చూపిన.. ఈ మహమ్మారి తాను పురుడు పోసుకున్న చైనాలోనూ ఇప్పడు మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. చైనాతో పాటుగా పలు దేశాల్లో ఇంకా మరణమృదంగాన్ని మ్రోగిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మంది ప్రజలను బలితీసుకుంది. చైనాలో ఒమిక్రాన్ లోని పరివర్తన్ చెందిన వేరియంట్ కొవిడ్ 19 ఎక్స్ఈ విజృంభిస్తుండగా, తాజాగా భారత్ లో మరో కొత్త వేరియంట్ పరివర్తన చెందింది.
ఇటు భారత్ లోనూ కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్లు పరివర్తన చెందిన రకాలు ప్రజలపై విరుచుకుపడుతూనే వున్నాయి. కాగా చైనాలో కరోనా విజృంభించిన నాటి నుంచి భారత్ లోనూ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఐఐటీ కాన్పూర్ కు చెందిన స్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 బయటపడింది. ఇది కరోనా థర్డ్ వేవ్లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్కంటే పదిరెట్లు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.
‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేము కరోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాం. 13 శాంపిళ్లను పరీక్షించాం. అందులో ఒకటి బీఏ.12 సబ్ వేరియంట్గా గుర్తించాం. మిగతా 12 శాంపిళ్లు బీఏ.2 సబ్ వేరియంట్’ అని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెచ్వోడీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వెల్లడించారు. ఇది బీఏ.2కంటే పదిరెట్లు ప్రమాదకరమని తెలిపారు. అయినా, ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీఏ.12 సబ్ వేరియంట్ను మొదట యూఎస్లో గుర్తించారు. ఢిల్లీలో ఈ సబ్వేరియంట్కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.
(And get your daily news straight to your inbox)
Jun 27 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 46 పోస్టుల భర్తీ... Read more
Jun 27 | అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు శనివారం జ్యుడిషీయల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. సాయి డిఫెన్స్ అకాడమీని... Read more
Jun 27 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ట్రబుల్ షూటర్గా పేరొందిన సేన ఎంపీ సంజయ్ రౌత్కు భూ కుంభకోణంలో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్, పత్రా చావల్... Read more
Jun 27 | ఆర్మీలో నియామకాల కోసం కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం నూతనంగా అగ్నిఫథ్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయి నిరసనలు, అందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి... Read more
Jun 27 | శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి..... Read more