తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సహా తెలంగాణకు మద్దతునిచ్చే పలు రాజకీయ పార్టీలతో కలసి ఉద్యమించిన ప్రజాగాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు.. మళ్లీ చాలాకాలం తరువాత ఇవాళ అందోళన కార్యక్రమంలో కనిపించారు. కేంద్రం తమ నిరంకుశ విధానాలను పక్కనబెట్టి తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనాల్సిందేనని అధికార టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి ఆయన మద్దతు పలికారు. తెలంగాణ ఉద్యమంలో వినిపించిన ఆయన గానం.. ఎంతోమంది ఉస్మానియా విద్యార్థులను ఉద్యమం వైపు నడిపించింది.
ఆ తరువాత ఆయన అనారోగ్య రిత్యా తెలంగాణ సాధించిన తరువాత కూడా ఇంటికే పరిమితం కాగా, మళ్లీ ఇన్నాళ్లకు తెలంగాణ రైతుల వడ్లను కేంద్రం కోనాల్సిందేనని రైతులకు తనవంతుగా మద్దతు పలుకుతూ గులాభి దళం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మెరిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు మండల కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. రైతుల అకాంక్షల మేరకు రాజకీయాలను పక్కన బెట్టి కేంద్రమే వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు అల్వాల్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ఇదే దీక్షలో ప్రముఖ గాయకులు యుద్ధనౌక గద్దర్ పాల్గొని నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను కేంద్రం కొనాల్సిందేనన్నారు. లేదంటే ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. గద్దర్ మాట్లాడుతూ.. అరుగాలం శ్రమించి రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనన్నారు. రైతుల బాధలను చూడలేకనే నిరసన దీక్షలో పాల్గొన్నట్లు గద్దర్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more