ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇక తమ నిరసనల పర్వం యధాతథంగా కొనసాగుతాయని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు స్పష్టం చేసిన తరుణంలో వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అటు ప్రభుత్వం అధికారులు నిమగ్నమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగులను బుజ్జగించే చర్యలకు ఎలా చేపట్టాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఏపీ అర్టీసీ కార్మికులు కూడా బాంబు పేల్చారు. ఓ వైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ యుద్ధం కొనసాగుతుండగానే.. ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యోగ సంఘాలకు సంఘీభావం ప్రకటించాయి.
ఉద్యోగులకు సంఘీభావంగా ఆర్టీసీ ఉద్యోగులు తమ మద్దతు తెలియజేస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి తాము సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగులు బహిరంగ ప్రకటన చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు ఆయా ఉద్యోగ సంఘాలు మెమోరాండం సమర్పించాయి. ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన మెమోరాండంలో ఆర్టీసీ ఉద్యోగులు 45 సమస్యలను ప్రస్తావించారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వారు అందులో కోరారు. వాటిని పరిష్కరించని క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు.
సమస్యలకు పరిష్కారం లభించని క్రమంలో ఫిబ్రవరి 6 అర్థరాత్రి నుంచి తాము సమ్మెబాట పడతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. అయితే ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనానికి ముందు అందులో పనిచేసే కార్మికులకు నాలుగు సంవత్సరాలుకు ఒకసారి పీఆర్సీ వచ్చేదని ఆర్టీసీ జేఏసీ నేతలు అంటున్నారు. ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తమకు పది సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వచ్చే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాము ఎందుకు విలీనం కోరుకున్నామా? అని బాధపడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఉద్యోగ సంఘాలకు ఆర్టీసీ కార్మికులు కూడా జతకలవడం ప్రభుత్వానికి శరాఘాతంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more