New Parliament Building Cost Shoots Up By 29% కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ఖర్చు పెంపు.. డెడ్ లైన్ కూడా..!

New parliament building s budget overshoots by 282cr to be ready by oct

new parliament building, Central Vista project, Tata Projects, cost another Rs 282 crore, hike over budget cost Rs 977 crore, 75th Independence Day, deadline October

The new parliament building, the highlight of the government’s flagship Central Vista project, will cost another ₹ 282 crore, sources said. The 29 per cent hike over the budgeted cost of ₹ 977 crore comes more than a year after the groundbreaking ceremony, which took place in December 2020.

కొత్త పార్లమెంటు భవన నిర్మాణ ఖర్చు పెంపు.. డెడ్ లైన్ కూడా..!

Posted: 01/21/2022 11:00 AM IST
New parliament building s budget overshoots by 282cr to be ready by oct

సెంట్రల్ విస్టా పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవన సముదాయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్ లో ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ. 977 కోట్లుగా ఉంది. అయితే ఏడాది గడిచే లోగానే బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా 29 శాతం పెరుగుదలతో రూ. 282 కోట్ల మేర పెరిగి... ప్రస్తుతం రూ. 1,249 కోట్లకు చేరుకుంది. కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ చేపట్టింది. రాష్ట్రపతి భవన్ కు కూతవేటు దూరంలో 13 ఎకరాల స్థలంలో పార్లమెంటు భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి.

ఈ ఏడాది మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం డెడ్ లైన్ ను అక్టోబర్ కు పొడిగించారు. కరోనా నిబంధనలు కూడా అడ్డురాని విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టు అయినందువల్ల పనులకు ఆటంకం కలగకుండా చూడాల్సి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పార్లమెంటు నిర్మాణ పనులకు కోవిడ్ ఆంక్షలు వర్తించవని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న పార్లమెంటు భవనం బ్రిటీష్ వారి కాలంలో నిర్మించినది. అయితే అందులో పార్లమెంటు సభ్యులకు చాంబర్లు లేకపోవడం గమనార్హం.

ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత భవనం లేకపోవడం, ఎంపీలకు సరైన విధంగా కార్యాలయాలు లేకపోవడం తదితర కారణాలతో కొత్త భవనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్త పార్లమెంటును లోక్ సభ ఛాంబర్ లో 888 మంది ఎంపీలు కూర్చునేలా నిర్మిస్తున్నారు. అంతేకాదు జాయింట్ సెషన్ (లోక్ సభ, రాజ్యసభ)లో 1,224 మంది సభ్యులు కూర్చునేలా అత్యంత విశాలంగా నిర్మిస్తున్నారు. రాజ్యసభలో 384 మంది కూర్చునేలా... అవసరమైతే సీటింగ్ పెంచుకునేలా నిర్మాణం చేపట్టారు. ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల కార్యాలయం ఉండేలా పార్లమెంటు ప్రాంగణంలోనే శ్రమ శక్తి భవన్ ను నిర్మిస్తున్నారు. ఈ భవన్ 2024కి పూర్తవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles