పల్నాడు గడ్డపై మరోమారు ప్రత్యర్థి వర్గాల మధ్య పగలు ప్రాణాలు తీసాయి. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన రాజకీయ నేత హత్య తీవ్ర కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట చంద్రయ్య దారుణ హత్యకు గురికావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ నేత చంద్రయ్యకు ఆయన రాజకీయ ప్రత్యర్థుల మధ్య కొంత కాలంగా గొడవలు ఉన్నాయి. చంద్రయ్య ఈ రోజు ఉదయం పని నిమిత్తం బైకుపై బయలుదేరి వెళ్లారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చంద్రయ్య కోసం కాపు కాసిన ప్రత్యర్థులు బైక్కు ఓ కర్ర అడ్డుపెట్టడంతో చంద్రయ్య కిందపడిపోయారు.
దీంతో ఆయనపై కత్తులు, కర్రలతో దాడి చేస్తూ విరుచుకుపడడంతో చంద్రయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన అనంతరం గుండ్లపాడులో ఉద్రిక్తత నెలకొనడంతో మాచర్ల పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులు చేయి దాటిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆధిపత్యపోరే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. అయితే, పోలీసులు చాలా ఆలస్యంగా గ్రామానికి వచ్చారని చంద్రయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయగా, తమ ప్రాంత టీడీపీ నేత బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించరాదని కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో గుండ్లపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు టీడీపీ నేతలు ఆ గ్రామానికి తరలివెళ్తున్నారు.
టీడీపీ నేత తోట చంద్రయ్యను కొందరు వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై గొంతు కోసి హ్యత చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనలో ఇప్పటికే చాలా మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పల్నాడులోనే పదుల సంఖ్యలో హత్యలు జరిగాయన్నారు. జగన్ పాలనపై తిరగబడుతుండడం వల్లే ప్రజలను భయపెట్టేందుకు వైసీపీ నేతలు ఈ హత్యలకు దిగుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేవారికే పదవులను ఇచ్చే విష సంస్కృతికి జగన్ బీజం వేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు హత్యాయత్నం చేశారని, పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే వైసీపీ బరితెగింపులు ఆగేవని అన్నారు. చంద్రయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 20 | రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతం ఈ... Read more
May 20 | ఓ వైపు వేదమంత్రోచ్ఛరణలు.. మాంగళ్యం తంతునానీనాం.. అంటూ.. వధూవరులను భార్యభర్తలుగా మార్చే పవిత్రమైన మంత్రాన్ని అందుకున్నారు అయ్యవారు. ఇంతలో ఆగండీ అన్న శబ్దం వినిపించింది. కళ్యాణమండపం ప్రధాన ద్వారం వరకు పెళ్లి వేదిక సహా..... Read more
May 20 | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కుని కాల్పులు జరిపారన్నది నమ్మశక్యంగా లేదని స్పష్టం చేసింది. నిందితులపై పోలీసులు... Read more
May 20 | రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ పరిమితి సంఖ్యలో పోటీ చేయబోతోందని అభిమానులకు నూతనోత్తేజం కలిగించేలా... Read more