మధ్యవర్తిత్వం వల్ల పెద్ద సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అవుతాయని, మధ్యవర్తిత్వం విఫలమైతే చిన్న సమస్యలు కూడా ఇబ్బందలు పెడతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కోర్టుల వరకు కేసులు రావడం అన్నది చివరాఖరి ప్రయత్నం మాత్రమే కావాలని ఆయన తెలిపారు. హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్-మీడియేషన్ సెంటర్ సదస్సుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక కేసుల్లో మధ్యవర్తిత్వం ప్రాధాన్యతను వివరించారు.
మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. పాండవులు, కౌరవుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు శ్రీకృష్ణుడు రాయబారం వహించాడని, కానీ ఆయన మధ్యవర్తిత్వం విఫలమైందని తెలిపారు. దాని ఫలితంగా ఎంతటి తీవ్ర పర్యవసానాలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందేనని సీజేఐ ఎన్వీ రమణ వివరించారు. సాధారణ సమస్యలు సైతం ఇగోలు, పట్టింపులు, భేదాభిప్రాయాల వల్ల జటిలం అవుతుంటాయని, మధ్యవర్తిత్వం వల్ల ఇలాంటి కేసులు సులువుగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
న్యాయ వ్యవస్థల్లో తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని, ఏదైనా అంశంలో చివరి ప్రయత్నంగానే కోర్టుకు వస్తే బాగుంటుందన్నది తన అనుభవంతో చెబుతున్నానని వెల్లడించారు. కోర్టు విచారణల కారణంగా అనేక సంవత్సరాల సమయం వృథా అవుతుందని రమణ వివరించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుందని, సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని అన్నారు.కాగా, లండన్, హాంకాంగ్, సింగపూర్, పారిస్ నగరాల్లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయని, ఆ తరహాలో హైదరాబాదులోనూ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more